పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులతో ఆ ఫంక్షన్ హాల్ అంతా సందడి నెలకొంది. ముహూర్తానికి సమయం దగ్గరపడుతోందని తొందర మొదలైంది. అంతలోనే అదే వేడుకలో విషాదం నిండుకుపోయింది. మరికాసేపట్లో పెళ్లి అనగా, వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న... విషాద ఘటన మేడ్చల్ జిల్లాలోకొంపల్లిలో చోటు చేసుకుంది. 


కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో వరుడు సందీప్‌ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు.. ఫంక్షన్‌ హాల్‌లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్‌ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్‌ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు గమనించి అంతా షాక్ కు గురయ్యారు.


దీంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది.  పెళ్లి ముహూర్తానికి ముందు ఆత్మహత్య చేసుకున్న సందీప్  హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసచారి కుమారుడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సందీప్ పేట్ బషీరాబాద్ పరిధిలో వుండే భాస్కర్-దేవికారాణి దంపతుల కుమార్తె మోనికాతో వివాహం నిశ్చయించారు.ఆమె కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆదివారం ఉదయం 11.35 గంటలకు వారి పెళ్లి చేసేందుకు కొంపల్లిలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఏర్పాటు చేశారు.

దీంతో శనివారం రాత్రే పెళ్లివారంతా అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉన్న సమయంలో సందీప్ తన గదిలో ఉరేసుకున్నాడు.  కొంపల్లిలోని ఫంక్షన్ హాల్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  ప్రేమ వ్యవహారంతోనే ఇలా చేశాడా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.   పెళ్లి ఇష్టం లేకపోతే ఆ విషయంచెప్పి పెళ్ళి మానుకోవాలి కాని, ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాదాకరం.  


మరింత సమాచారం తెలుసుకోండి: