సుప్రీం కోర్ట్ అయోధ్య విషయంలో తీర్పు ఇచ్చిన సంగతీ తెల్సిందే. సుప్రీం కోర్ట్ హిందువులకు అనుకూలంగా తీర్పును ఇచ్చినా ముస్లింలు సానుకూలంగా సుప్రీం తీర్పును స్వాగతించడం గమనార్హం.  అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం కట్టుకోవడానికి హిందువులకు సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీనిపై ప్రతివాదులుగా ఉన్న ముస్లిం సంఘాలు కూడా రిట్ పిటీషన్ వేయకూడదని నిర్ణయించుకున్నాయి. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీం కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు హిందువులకు అనుకూలంగా ఇచ్చిన ఈ తీర్పుపై ముస్లిం సంఘాలు ప్రముఖుల్లోనూ సానుకూలత వ్యక్తమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇప్పటికే ఈ వివాదం పై ఒవైసీ అధినేత కూడా స్పందించారు. ఒవైసీ అధినేత  సుప్రీం తీర్పు పట్ల తన అసంతృప్తిని తెలియజేశారు. కానీ మెజారిటీ ముస్లిం లు సుప్రీం తీర్పును ఆహ్వానించి హిందువులు .. ముస్లింలు కలిసిపోవాలని కోరుకుంటున్నారు.  తాజాగా మోఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు అయిన ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ కూడా అయోధ్య వివాదంపై స్పందించాడు.శనివారం అయోధ్య భూవివాదంపై సుప్రీం తీర్పునివ్వడంతో ప్రిన్స్ యాకుబ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశారు. తాను అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి బంగారు ఇటుకను కానుక ఇస్తానని హామీ ఇచ్చారు.


దీనితో ఇప్పుడు మొఘల్ వారసుడి వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొఘల్ వారసుడు చేసిన వ్యాఖ్యల పట్ల హిందువులుతో పాటు ముస్లింలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడగానే.. ప్రధాని నరేంద్రమోడీని కలిసి బంగారు ఇటుకను బహూకరిస్తానని చెప్పుకొచ్చాడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశంలోని ముస్లింలు అందరూ హిందువులకు సహకరించాలని.. సోదరభావం చాటాలని ప్రిన్స్ యాకుబ్ పిలుపునిచ్చాడు. హిందూ ముస్లింలు కలిసి సాగితేనే అసలైన సెక్యులరిజమ్ మతసామరస్యం సాధ్యమవుతుందని.. ప్రపంచానికి ఒక గొప్ప  పాఠం చెప్పగలమని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: