మహారాష్ట్ర రాజకీయం వేగంగా మారుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా వెనక్కితగ్గడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించడం.. ఈ రోజు ఉదయం ఆ పార్టీ
ఎంపీ అరవింద్ సావంత్ కేంద్రమంత్రి పదవికి
రాజీనామా చేస్తాననడం ఆసక్తికరంగా మారాయి.
బిజెపి యొక్క చిరకాల
మిత్ర పార్టీ
శివసేన ఎన్సిపి,
కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నందున
బీజేపీ పార్టీతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు
శివసేన పార్టీ ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు
శివసేన మహారాష్ట్ర గవర్నర్ను కలవనుంది. మద్దతు లేఖను అందజేయడానికి మరియు మెజారిటీని నిరూపించడానికి
గవర్నర్ నుండి సమయం కోరనుంది. ఈ రోజు
సేన భవన్లో
శివసేన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
ఈ రోజు కాంగ్రెస్తో మేము భేటీ అవుతాం. ఏ నిర్ణయం తీసుకున్నా అది
కాంగ్రెస్ తో చర్చించిన తరువాత మాత్రమే" అని పేర్కొన్నారు. ఎన్సిపి చీఫ్
శరద్ పవార్ ఈ రోజు సోనియా
గాంధీ తో భేటీ అవ్వనున్నారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన
శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు. ఈ రోజు
మహారాష్ట్ర రాజకీయం లో ఒక ఫలితం వచ్చే అవకాశం ఉంది.