కాంగ్రెస్ నేతల్లో
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతునిచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పలువురు నేతలు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంతృప్తికరంగా ఉన్నా కొంతమంది మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్సీపీతో కలిసి
శివసేన మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో
కాంగ్రెస్ భాగస్వామం అయితే అది పార్టీ వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే గడిచిన ఆదివారం రాత్రి నుంచి
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే.
శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతు కోసం విశ్వప్రయత్నాలను చేస్తోంది.
సేన ప్రతిపాదనపై
కాంగ్రెస్,
ఎన్సీపీ నేతలు ఢిల్లీలో సమావేశమై చర్చిస్తున్నారు.
దీనిపై సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ సీనియర్ నేతలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సమయంలో శివసేన-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా లౌకిక పార్టీగా ఉన్న
కాంగ్రెస్ శివసేనతో అధికారాన్ని పంచుకోవడం సరికాదు. అది పార్టీ మూలాలకు చాలా ప్రమాదం. వీలైతే మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం సరైనది.
అయితే శివసేనతో పొత్తుపై చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో
సేన మాతో (కాంగ్రెస్)తో కలిసి వస్తుందా?. లేదా అనేది ఇప్పుడే తేల్చుకోవాలి. పూర్తి స్థాయి చర్చలు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తే.. అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది’ అని నిరుపమ్ అభిప్రాయపడ్డారు.
కాగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సేనకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. దీంతో
ఎన్సీపీ,
కాంగ్రెస్ మద్దతు కోసం
సేన నేతలు
ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో
ఎన్సీపీ షరతుకి తలొగ్గిన
సేన కేంద్ర మంత్రిపదవులకు
రాజీనామా చేసింది. దీంతో శివసేనకు
ఎన్సీపీ,
కాంగ్రెస్ మద్దతునిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.