ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత....ఘాటు రిప్లై ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. మౌలానా అబుల్ కలాం అజాద్ 142వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జగన్...విమర్శకులపై విరుచుకుపడ్డారు. ``ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమారుడు, మనవడు ఎక్కడ చదువుతున్నారు? వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? సినిమా నటుడు పవన్ కల్యాణ్ కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో, ఎంత మంది పిల్లలో మరి.. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా? మేం ప్రపంచ స్థాయి కోసం ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే...కొన్ని మీడియాలు, వీరంతా విమర్శలు చేస్తున్నారు`` అని మండిపడ్డారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...మౌలానా అబుల్ కలాం
అజాద్ 142వ
జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ``విద్యా శాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధి తోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్పూర్తితో సీఎం
జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు. మైనారిటీలకు మంచి
విద్య అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. గత పాలకులు వారిని ఓటు బ్యాంకు కోసం వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్ అంజాద్ భాషా కు ఉప
ముఖ్యమంత్రి ఇచ్చి.. పక్కన కూర్చోబెట్టుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నాం. `` అని వెల్లడించారు.
కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్దులకు ప్రోత్సాహం అందించాలని
జగన్ నిర్ణయించారని
మంత్రి వెల్లడించారు. ``ఈ ఏడాది ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రతిభ ఉన్న వారికే అవార్డులు అందించాం. వైయస్ ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేశారు.
జగన్ కూడా దళితులు, మైనారిటీలకు మెరుగైన విద్యను అందించేలా సంస్కరణ లకు శ్రీకారం చుట్టారు. తన పాదయాత్ర లో ప్రజల కష్టాలు నేరుగా విని...వారి కన్నీరు తుడిచేలా పధకాలు అమలు చేస్తున్నారు.వందల, వేల కోట్లు కమిషన్ కోసం ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం
జగన్ చిత్తశుద్ధి నిదర్శనం. దీనిపై ఎంతో మంది అవాకులు, చవాకులు పేలుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ల ను మార్చేసే ఆలోచనతో జగన్ నాడు..నేడుకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే... అమ్మ ఒడి పధకాన్ని అందిస్తున్నారు. విద్యా వ్యవస్థ లో నూతన ప్రణాళికలు భవిష్యత్తు తరాలకు వరంగా మారతాయి`` అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయని
మంత్రి సురేష్ పేర్కొన్నారు. `మాజీ ముఖ్యమంత్రి నారా వారు కూడా మాట్లాడతారు.. మనం చూశాం.. బ్రీఫ్ డ్ మీ అని ఆయన పాపులర్ అయ్యారు` అని ఎద్దేవా చేశారు.