విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న
విజయవాడ భవానీపురంలో కిడ్నాపైన చిన్నారి శవమై కనిపించింది. చిన్నారి ద్వారకను గుర్తు తెలియని దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. పక్కింట్లోనే చిన్నారిని
హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ఇంటిముందు ఆడుకుంటూ ఉండగా ద్వారక కిడ్నాప్ కు గురైంది. నిన్న మధ్యహ్నం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న 8 సంవత్సరాల చిన్నారి ద్వారక అదృశ్యమైంది.
ద్వారక కుటుంబ సభ్యులు సమీపంలోని
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపారు. నాలుగు ప్రత్యేక బృందాల ద్వారా పోలీసులు ద్వారక కోసం గాలించారు. అనుమానాస్పద ప్రాంతాలలో, రైల్వే స్టేషన్ లలో, బస్టాండ్ లలో సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించారు. పోలీసులకు అనుమానం రావటంతో పక్కింట్లో వెతికారు. పోలీసులు పక్కింట్లో
హత్య చేసి మూట కట్టి బీరువాలో దాచి ఉంచినట్లు గుర్తించారు.
పాప మృతదేహం దొరకటంతో పోలీసులు నిందితులపై దృష్టి పెట్టారు. ద్వారక తల్లిదండ్రులు ప్రకాష్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ కు, ద్వారక తల్లిదండ్రులకు విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న పాప
తండ్రి మాత్రమే పాప ఆడుకునే సమయంలో ఇంట్లో ఉన్నట్లు సమాచారం. ప్రకాష్ ద్వారక తల్లిదండ్రులకు సమీప బంధువని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ద్వారక హత్యకు గల కారణాలేమిటి...? ప్రకాష్ ద్వారకను
హత్య చేశాడా...? అనే విషయాలు దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. ద్వారక తల్లిదండ్రులు రోజూ పనికి వెళ్లి వచ్చిన డబ్బుతో పాపను చదివించుకునేవారని అంత ఆర్థిక స్థోమత కూడా లేదని తెలుస్తోంది. ద్వారక తల్లిదండ్రులను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాప
తండ్రి మాట్లాడుతూ పాపను ఎవరు
హత్య చేశారో అర్థం కావటం లేదని చెబుతున్నాడు.