ఈ మధ్యకాలంలో లోకంలో జరుగుతున్న ఆరాచకాలను చూస్తుంటే మనుషుల మానసిక స్దితి ఎంతలా దిగజారుతుందో తెలుస్తుంది. ఈ సమాజంలో బ్రతుకుతూ కూడా అరణ్యంలో బ్రతికినట్లుగా భయంగా ఉండవలసి వస్తుంది. నేటి కాలంలో బ్రతుకు విలువ తెలియక, మనిషి మనిషిలా ఉండక పూర్తిగా జంతువులకంటే హీనంగా మారి లోకంలో టెర్రరిస్టులకంటే భయంకరమైన దారుణాలు చేస్తున్నాడు.


చిన్నారి ద్వారకను హత్యచేసిన ప్రకాష్ లాంటి వారిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఒక్క ప్రకాష్ మాత్రమే కాదు ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనలు కూడా మనిషిలోని మానసిక వైకల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఇక విజయవాడలో జరిగిన ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారక అదృశ్యం, హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను దారుణంగా హత్య చేసి అనంతరం గోనెసంచిలో మూటకట్టిన నిందితుడు ప్రకాష్ ఓ సైకో అని తెలుస్తోంది.


ఈ విషయమై ప్రకాష్ భార్య సునీత మాట్లాడుతూ, మందు తాగితే తన భర్త సైకోలా ప్రవర్తిస్తాడని తనకు ముందే తెలుసు కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే గతంలో ఇతని ప్రవర్తన వల్ల అక్కడి వారు స్వగ్రామం నుంచి తరిమికొట్టగా, ఇప్పుడు భవానిపురం వచ్చి ఉంటున్నామని సునీత సంచలన నిజాలు బయటపెట్టింది... ఇక్కడికి వచ్చాక పక్కింటి వారితో బాగానే ఉండేవాడని కాని మందు తాగితే సైకోగా మారిపోతాడని అనుకున్నాం, కానీ చిన్నారిని చంపేస్తాడని ఊహించలేదని వాపోయింది.


నిన్న కూడా ఇంట్లో తన భర్తతో గొడవ జరిగిందని నిత్యం తాగి ఇంట్లో భయంకరంగా ప్రవర్తిస్తూ, తనను మానసికంగా వేధించే వాడని తాగడానికి డబ్బులు ఇవ్వకుండే ఇల్లంతా ధ్వంసం చేస్తాడని తెలిపింది. ఇక ఇంట్లో గొడవ పెట్టుకుని ప్రకాష్  వెళ్లగా గొడవ జరుగుతున్న సమయంలో విసిరేసిన ఏటీఎం కార్డు కోసం వెతుకుతుండగా తలుపు పక్కన ఓ మూట కనిపించిందని..


తాకితే మెత్తగా రక్తంతో తడిసి కనిపించగా భయంతో తాను బయటకు పరుగులు తీసి అందరికీ ఆ విషయం చెప్పానని సునీత పేర్కొంది. అంతకుమించి తనకు ఏమీ తెలియదని.. పాపను కిరాతకంగా చంపేస్తాడని అనుకోలేదని కన్నీరుమున్నీరైంది. ఈ సందర్భంగా తన భర్త తనకు కనిపిస్తే తానే చంపేస్తానని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇకపోతే పాపను చంపి ఏమి తెలియనట్లుగా నంగనాచిలా ఉన్న ప్రకాష్ భయంకరమైన సైకో అని తెలుస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: