ఏ పార్టీకి కూడా
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్సింగ్ ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం రాత్రి 8:30లోగ తుది నిర్ణయం తెలపాలని కోశ్యారీ ఎన్సీపీకి గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.గవర్నర్ భగత్సింగ్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమయిందని నివేదిక ఇస్తారని తెలుస్తోంది. దీనిపై మంగళవారం ఎన్సీపీకి ఇచ్చిన గడువు వరకు వేచి చూసే అవకాశం ఉంది. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్సీపీ కూడా నో చెబితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తోంది.
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు
కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి దీన్ని బట్టి
ఎన్సీపీ ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ వున్నట్టు తెలుస్తుంది . ఇటు హస్తం నేతలు శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీనిపై సోమవారంమే పార్టీ వర్కింగ్ కమిటీ గంటల తరబడి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా తమ నిర్ణయాన్ని మాత్రం చెప్పడానికి ముందుకు రావడంలేదు. దీనిపై ఈ మంగళవారం సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ మరోసారి భేటీ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై నేడు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే
కాంగ్రెస్ ముఖ్యనేతలు సీఎం పీఠం ఎన్సీపీకి అప్పగిస్తేనే మద్దతు తెలపాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్తో శరద్ పవార్ భేటీ అయ్యారు. అయితే సమావేశం అనంతరం భేటీ వివరాలను వెల్లడించడానికి పవార్ నిరాకరించారు. మంగళవారం వరకు గడువు ఉండటంతో మరోసారి
ఎన్సీపీ,
కాంగ్రెస్ నిర్ణయం కోసం
సేన నేతలు ఎదురు చూస్తున్నారు.
ఇక
ఎన్సీపీ నేతలు కూడా మరోసారి భేటీ నిర్వహణకు సిద్ధమయ్యారు. గవర్నర్ ఇచ్చిన గడువుకు సమయం దగ్గర పడుతుండటంతో నేటి మధ్యాహ్నాంలోపు ఇరు పార్టీల నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదిలావుండగా.. శివసేన సీఎం కుర్చీని అధిష్టించాలనుకున్నఆశలు అడియాశలుగానే మిగిలేలా ఉన్నాయి.
శివసేన సోమవారంమే
కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందని ఆశించిన చివరి నిమిషం వరకు ఎదురుచూసింది. అయితే హస్తం నేతలు దీనిపై మరింత లోతుగా చర్చించిన అనంతరమే తమ నిర్ణయం ప్రకటిస్తామని ప్రకటించారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు
శివ సేన .