ఒక అమ్మాయి పరీక్ష రాసేందుకు తెలియని ప్రాంతానికి వెళ్లిన యువతి బంధువు చేతిలోనే అత్యాచారానికి గురైన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగులోకి రావడం జరిగింది. రాత్రిపూట రూమ్‌ షేర్ చేసుకున్న వరుసకు బావ అయ్యే యువకుడు ఆమెను నిద్రలోనే రేప్ చేసి వేధింపులకు గురి చేయడం జరిగింది. హర్యానాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 22వ తేదీన గురుగ్రామ్‌కు ఒంటరిగా వెళ్లడం జరిగింది. అక్కడ తనకు తెలిసిన వారు ఎవరు లేకపోవడంతో హోటల్‌లో రూమ్ తీసుకుందామని నిర్ణయం తీసుకుంది.


ఈ తరుణంలో తనకు వరుసకు బావ అయ్యే యువకుడి సాయం తీసుకుంటే మంచిది అని భావించింది. అతడికి ఫోన్ చేయగా తానుకూడా గురుగ్రామ్‌లోనే ఉన్నానని, కావాలంటే తాను బస చేసిన హోటల్‌ రూమ్‌లోనే ఉండొచ్చని అతడు తెలిపాడు. తనకు వేరే రూమ్ కావాలని, షేర్ చేసుకోవడం తనకిష్టం లేదని యువతి ఎంత చెప్పినా యువకుడు అసలు వినిపించుకోలేదు. ఒక్క రాత్రి కోసం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావ్, రాత్రి ఉండి మరుసటి రోజు ఎగ్జామ్‌కి వెళ్లొచ్చు అంటూ యువతిపై ఒత్తిడి చేయడం మొదలు పెట్డాడు . ఆమె సరేనని చెప్ప రూమ్‌కి పోవడం జరిగింది. రాత్రి ఇద్దరూ భోజనం చేశాక యువతి నిద్రలోకి వెళ్ళిపోయింది. 


ఆ తర్వాత ఇదే సరైన సమయమని భావించిన ఆ యువకుడు ఆమెపై నిద్రలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై ఏదో బరువు ఉన్నట్లుగా భావించిన యువతి నిద్రలేచి చూడగా యువకుడు ఉన్నాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ఎంత ప్రయత్నించినాకూడా ఫలితం లేకుండా అయ్యిపోయింది. తనను వదిలేయాలని ఆమె ఎంత బతిమాలినా విడిచిపెట్టకుండా అఘాయిత్యానికి పాల్పడిన ఆ కామాంధుడు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


దీంతో బాధితురాలు మరుసటి రోజు పరీక్ష రాసేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం యువతి పూర్తిగా డిప్రెషన్‌లోకి ఉండిపోవడంతో అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు సైక్రియాటిస్ట్‌‌కి చూపించగా ఏదో చూసి బయపడిందని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయగా  అసలు విషయం  చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: