విజయవాడ లో దారుణ హత్యకు గురైన మొవ్వ  ద్వారక హత్య  కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది . ద్వారక అదృశ్యమై  పక్కింట్లోనే శవమై కన్పించిన విషయం తెల్సిందే .   ద్వారకా హత్యకు ఆమె తల్లి రమణ కు, నిందితుడు ప్రకాష్ కున్న  వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ కేసులో నిందితుడైన ప్రకాష్ తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.  వీరిద్దరి మధ్య లో జరిగిన ఫోన్ సంభాషణ ఈ కేసులో కీలకం కానుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.


 ద్వారక తల్లి కి ప్రకాష్ కు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని,  అదే ద్వారక హత్యకు దారి తీసిన టు అనుమానిస్తున్నారు . ఈ మేరకు ద్వారక  తల్లికి, ప్రకాష్ అనేక  సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లుగా పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు.  దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ పై  ఆరాతీస్తున్నారు.  కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాష్ ఇంతకుముందే అంగీకరించిన విషయం తెలిసిందే.  విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి నల్లగుంట లో అదృశ్యమైన ద్వారక ,  తమ పక్కింట్లో ఉండే ప్రకాష్ ఇంటిలోనే శవమై కన్పించడం ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది . నిందితుడు బాలికపై అత్యాచారం చేయబోగా , ఆమె కేకలు పెట్టడం వల్లే హత్య చేశాడని ప్రాథమిక విచారణ తేలింది .


  అయితే   తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రమణ , ప్రకాష్ లు ద్వారక ను  పథకం ప్రకారం హత్య చేసి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు . ద్వారక ను ప్రకాష్ అత్యాచారం చేయబోతే అరిచినందుకు హత్య చేశాడా?, లేకపోతే ఆమె తల్లి సహకారం తోనే హత్య చేశాడా ?? అన్నది పోలీసు విచారణ లో మరికొద్ది గంటల్లోనే తేలనుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: