ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేడి వేడిగా ఉన్నాయి. ఎందుకు ఇంత వేడి అంటే.. అధికార పార్టీ ప్రజలకు వరాలు ఇస్తుండటం చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ అటు అడుగు వేసిన ఇటు అడుగు వేసిన హల్ చల్ చేస్తున్నారు. అటు వెళ్తే అటు వెళ్తున్నారు అంటారు ఇటు వెళ్తే ఇటు అంటారు. ఇలా ఎం చేసిన గొడవలే..
అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్న
పవన్ కళ్యాణ్ ఇటీవలే భవన్ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా వైజాగ్ లో ఓ ర్యాలీ కూడా నిర్వహించాడు. ఇప్పుడు
ట్విట్టర్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పై భారీ ట్విట్లు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈరోజు
జనసేన పార్టీ అధినేత
పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్
గవర్నర్ విశ్వరూప్ హరిచందన్ ను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంలో భోధన తదితర అంశాలపై
పవన్ కళ్యాణ్ గవర్నర్ విశ్వరూప్ హరిచందన్ తో చర్చించనున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని
గవర్నర్ ను
పవన్ కళ్యాణ్ కోరనున్నారు. ఇసుక సమస్య గురించి, ఇంగ్లిష్ గురించి మాట్లాడనున్నట్టు సమాచారం. మరిన్ని విషయాలు భేటీ తర్వాత తెలుస్తాయి.