అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి :ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ ఎంప్లాయీస్‌’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు పొరుగుసేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు.


ఈ మేరకు ఆయా శాఖాధిపతుల కమిటీ నుంచి డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని,ఈ ఉద్యోగాలలో మాత్రము 50 శాతం మహిళలకు కచ్చితంగా ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ను ప్రారంభిస్తున్నామని, పొరుగుసేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా, మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు.


వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్లేస్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు సీఎం జగన్ చెప్పారు. ప్రతి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగానికి కోడ్‌ నెంబర్‌ ఉంటుందని.. ప్రతి కాంట్రాక్ట్‌ను ఒక ఎంటీటీగా తీసుకోవాలని సూచించారు.. మధ్యవర్తులు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగేందుకు ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్‌ పరిధిలో భర్తీ చేస్తామన్నారు.


ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు లంచాలు తీసుకొని ఇచ్చే పరిస్థితి ఉండకూదన్నారు సీఎం. లంచాలు, మోసాలకు అవకాశం లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50శాతం ఉద్యోగాలు ఇస్తామని గతంలోనే ప్రకటించామని గుర్తు చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు వచ్చేలా చూస్తామని.. అందుకే ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: