ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకు మరో పేరు అని అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం
జగన్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లాస్థాయిలో 50శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని
ముఖ్యమంత్రి వైఎస్
జగన్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్
జగన్ ఈరోజు
ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు.
ఏపీ ఆప్కాస్ వెబ్సైట్ను కూడా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్
జగన్ 50శాతం ఉద్యోగాలు మహిళలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే సంవత్సరం
జనవరి 1 నుంచి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్లేస్మెంట్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు సీఎం
జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ కార్పోరేషన్ను ప్రారంభిస్తున్నామని, పొరుగు సేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తున్నామని, జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా, మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం
జగన్ వివరించారు. పొరుగు సేవల ఉద్యోగాల్లో
ఎస్సీ,
ఎస్టీ,
బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని,
అంతేకాకుండా
జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయా శాఖాధిపతుల కమిటీ నుంచి డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని,
జనవరి 1 నుంచి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం
జగన్ నిర్ణయంపై
ఏపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.