హైదరాబాద్ లో ఓ విహాహిత తన ప్రియుడితో కలిసి రాసలీలలు చేస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ప్రియుడిని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ లోని కొత్తపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నివాసి అయినా రవి... తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్ కి వచ్చి కొత్తపేటలో ఉంటున్నాడు. రవి భార్యది సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచనూరు గ్రామం. అయితే అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ళ కె.ప్రణీత్‌రెడ్డి కి ఈమెకు చిన్నతనం నుంచే బాగా పరిచయం. 


ప్రణీత్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాలకై హైదరాబాద్ కి తరుచుగా వచ్చి వెళ్తుండేవాడు. అలా హైదరాబాద్ వచ్చి వెళ్తున్న ప్రణీత్ రెడ్డి కి రవి భార్య కి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రవి ఇంట్లో లేని సమయం చూసి ప్రణీత్ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు. ఇలా వాళ్ళ రాసలీలలు కొనసాగుతూ ఉండడంతో, ఒకరోజు రవి కి ఈ విషయం తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయిన రవి.. వాళ్ళని పట్టుకుందాం అని ఓ పక్క ప్రణాళికను వేశాడు. దీంతో సోమవారం రోజు రవి తన భార్యతో పనికి వెళ్తున్న అని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు. 


భార్య కొద్దిసేపు ఆగి తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. ఇక ఎప్పటిలాగానే బెడ్‌రూమ్‌లో రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో భర్త ఇంట్లోకి వెళ్లి వారిద్దరికీ షాక్ ఇచ్చాడు. వెంటనే 3 ఏళ్ళ కొడుకుని, భార్యని బయటకి పంపి ప్రియుడి తలపై గట్టిగ కర్రతో కొట్టాడు. దాంతో ప్రణీత్ రెడ్డి కి తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే మరణించాడు. తర్వాత రవి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన ఇప్పటికే చాలా మంది చచ్చిపోయారు అయినా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: