మాన‌వ స‌మాజంలో బంధాలు, అనుబంధాల‌కు అస్స‌లు చోటే లేదు. ఎవ‌రికి వారు విచ‌క్ష‌ణ మ‌రిచి మ‌రీ ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చాలా సార్లు మ‌నుషుల క‌న్నా జంతువులు బెట‌ర్ అన్న నానుడి రుజువు అవుతోంది. అందుకే పెద్ద‌లు సైతం నీ క‌న్నా పశువు న‌య్యం రా ? అని చాలా మంది చెడ్డ‌వాళ్ల‌ను తిడుతూ ఉంటారు. అంటే మ‌నిషి గుణం క‌న్నా జంతువుల గుణం గొప్ప‌ద‌నే వాళ్ల భావ‌న‌.


ఇది పూర్వాకాలం నుంచి ఉన్న నానుడే. ఎంతో విజ్ఞానం తెలిసిన మ‌నుషులు కొన్ని సార్లు జంతువ‌ల క‌న్నా హీనంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న చూస్తే క‌డుపు తుర‌క్కుపోక మాన‌దు. కొంద‌రు మ‌నుష్యులు చాలా దారుణాతి దారుణంగా పిల్లిని ఉరి వేసి చంపేశారు. పైగా వాళ్లు ఉరి వేసి చంపేసిన పిల్లి గ‌ర్బంతో ఉంది. కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిని బ‌ట్టి వాళ్ల‌ను మ‌నుష్యులు ?  అనాలో ?   లేదా ఇంకా దేనితో పోల్చాలో అర్థం కాని ప‌రిస్థితి.


కేర‌ళ రాష్ట్రంలోని పాల్‌కులంగరకు సమీపంలోని ఓ ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పిల్లికి ఉరివేశారు. వినోద కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఎదుట ఈ దారుణం వెలుగుచూసింది. పిల్లికి ఉరివేసిన ఘ‌ట‌న చూసిన కొంద‌రు ఈ విష‌యాన్ని మీడియా దృష్టికి తేవ‌డంతో ఇది వార్త‌ల్లోకి వ‌చ్చింది.


ఫెడరేషన్ ఫర్ ఇండియన్ ఎనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ పార్వతి మోహన్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పార్వతి మోహన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లబ్‌కు వచ్చి మందు సేవించి, జూదం ఆడే వ్యక్తులు మద్యం మత్తులో సరదా కోసం ఈ పని చేసి ఉంటారని పార్వతి మోహన్ ఆరోపిస్తున్నారు. చనిపోయిన పిల్లి గర్భంతో ఉన్నట్లుగా గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: