జనసేన నాయకుడు
పవన్ కళ్యాణ్ తాజాగా ఏర్పాటు చేసిన
మీడియా సమావేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమావేశంలో ఎపి సీఎం
జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ
పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలంగా మారాయి. సీఎం మితిమీరిన మాటలు దేశాన్ని బ్రష్టు పట్టించేలా ఉందని
పవన్ అన్నారు. యదా నాయక తదా నేత అన్నట్లు ఇక్కడ జరుగుతుంది. ఆయన చెడిపోవడమే కాదు, 150 మంది నాయకులను కూడా చెడగొట్టుతున్నావ్ అని
పవన్ అన్నారు.
పవన్ మాట్లాడుతూ..
జగన్ గారు కొంచం మర్యాదగా మాట్లాడండి.. ఎవరిని ఎం మాట్లాడుతున్నారు. కొంచం మర్యాదగా మాట్లాడండి అంటూ వ్యాఖ్యానించారు. నిన్ను చూసి నీ ఎమ్మెల్లే లు కూడా నిన్ను చూసి రెచ్చిపోతున్నారు. పాము శివుడి మెడలో ఉన్నంత వరకే గౌరవం అని, ఒక్కసారి
జగన్ రెడ్డి పరిస్థితి తారుమారైతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందే భాషా ప్రయుక్త ప్రాతిపదికన అని, ఆ విషయం మీరు చరిత్రలో చదువుకున్నారా? లేదా? అని
జగన్ ను ప్రశ్నించారు.
ఎవరి పని వారు చేసుకుంటే మంచిది. ఒకరిని ఎప్పుడు వేలెత్తి చూపకూడదు అలా చేస్తే దేవుడనే వాడు చూస్తూ ఉంటాడు. ఇక్కడొక చోట ఆ తప్పులను చూపిస్తాడు. నాయకుడు నాయకుడిలా ఉండాలి అంతేకాని, ఇష్టానుసారంగా అంటే ఇక్కడా చేతులకు ఎవరు గాజులు తొడుక్కొని లేరు అంటూ
పవన్ జగన్ ప్రభుత్వానిపై విరుచుకు పడ్డారు. ఈ మాటలు
పవన్ ఫ్యాన్స్ ను కూడా ఖడించాయని వేరేలా చెప్పనక్కర్లేదు.
ఇకపోతే.. నేనప్పుడు మీ పర్శనల్ జీవితం గురించి మాట్లాడాలేదు. కేవలం మిమ్మల్నే కాదు.. మీ ఎమ్మెల్లే లపై కూడా ఎప్పుడు నాకు తెలిసి విమర్శలు చేయలేదు అంటూ
పవన్ అన్నారు. "నేనెప్పుడూ మీ వ్యక్తిగతంపై మాట్లాడలేదు. మిమ్మల్నే కాదు మీ ఎమ్మెల్యేలపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ ఓ స్థాయి దాటిందంటే మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసినవాడ్ని. "ఏం
జగన్ రెడ్డి గారూ, నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు, విజయసాయిరెడ్డిగారూ కలిసి రెండు సంవత్సరాలు జైల్లో కూర్చున్నారా? అడిగిన దానికి సరిగా స్పందించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు" అంటూ
జగన్ వార్నింగ్ ఇచ్చాడు.. ఈ మాటలను బట్టి
జగన్ పవన్ నాయకుడైయ్యాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు..