జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం రోజు రోజుకు మించిపోతుంది. ప్రజలకు ఎంత మంచి చేసిన ఆ మంచిలో ఏదొక చేదు బయటకు తీసి అధికార పార్టీని విమర్శిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో మొత్తం అంతా ఒకటే తీరు..    

                 

ముఖ్యమంత్రిని మూడు పెళ్లిళ్లు చేసుకోమనడం, అతిగా మాట్లాడటం అంత అదే తీరు. ఎవరైనా ప్రజలలో తిరగాలి అని అనుకునే నాయకుడు ఇలాంటి పిచ్చి మాటలతో పిచ్చి సలహాలు ఇవ్వరు అని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు వైసీపీ మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు.     


ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పేరు కాస్త పవన్ నాయుడు అయ్యింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు అని ఇప్పటికే అందరూ అంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పేరు కాస్త పవన్ నాయుడు అయ్యింది. అయితే మంత్రి పేర్ని నాని పవన్ నాయుడుపై మండిపడ్డారు.     


ప్రభుత్వ పథకాలు పవన్‌ నాయుడికి కనిపించడంలేదా? కేవలం ఇసుక కొరత మాత్రమే కనిపిస్తుందా? అని పేర్ని నాని పవన్ నాయుడుని ప్రశ్నించారు. గోదావరిలో వరద ఉధృతి తగ్గలేదు అందుకే ఇలా అని అన్నారు. చంద్రబాబు మాటలు పట్టుకుని పవన్‌ నాయుడు రోడ్లపైకి వస్తున్నారన్నారు.      


కేవలం చంద్రబాబు చెప్పిందే మీకు వినిపిస్తుందా? అని పేర్నినాని ప్రశ్నించారు. కార్మికుల సొమ్ము రూ.1200 కోట్లు దోచుకున్న అచ్చెన్నను పక్కన కూర్చోబెట్టుకుని పవన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అన్న పవన్‌ నాయుడు ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించాడా? అని ప్రశ్నించారు.       


మరింత సమాచారం తెలుసుకోండి: