కొడుకు ఎంతటి దుర్మార్గుడైనా కడుపున పుట్టాడు కాబట్టి భరిస్తూ.. బారాయిస్తూ.. అవమానాలు ఎదుర్కొంటు .. అవసరమైతే రెక్కల కష్టంతో పోషిస్తూ వస్తుంటారు. వారికీ ఒక పరిధి ఉంటుంది. ఎంత కొడుకైనా కావొచ్చు.. రోజు కొడుకు పెట్టె చిత్ర హింసలు తట్టుకోగలరా చెప్పండి. పోనీలే చిన్నపిల్లవాడు తెలుసుకుంటాడులే అనుకోవడానికి వాడు చిన్నపిల్లవాడు కాదు. 42 ఏళ్ళవయసు.
పెళ్లి చేసుకొని చాలా కాలం అయ్యింది. పిల్లలు కూడా చేతికి వస్తున్నారు. పిల్లలు చేతితి వస్తున్న సమయంలో తల్లి దండ్రులను కొట్టి హింసించేవాడు. రోజు తాగివచ్చి గొడవ చేసేవాడు. అతని గొడవ భరించలేక
భార్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. ఆ తరువాత కూడా అతని రగడ ఆగలేదు. అలా చేస్తూనే ఉన్నాడు. రోజు తాగడం.. వయసులో పెద్దవాళ్లైనా తల్లి దండ్రులను చితకబాదటం చేస్తున్నాడు.
దీంతో పాపం ఆ తల్లిదండ్రులు విసిగిపోయారు. కొడుకుపై
ప్రేమ ఉన్నప్పటికీ వాడు పెట్టె చిత్రహింసలు.. వాడి వలన దూరమైనా కోడలు, పిల్లలు గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డారు. చివరకు ఫుల్ గా తాగి వచ్చిన కొడుకు చేతులు కట్టేసి.. కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం చేశారు. అయితే, పోలీసుల విచారణలో అది ఆత్మహత్య కాదు
హత్య అని తేలడంతో అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
వారిని ప్రశ్నించగా అన్ని విషయాలు బయటకు వచ్చాయి. కొడుకు చేస్తున్న పనుల గురించి పెద్ద వయసులో కూడా తమను పెడుతున్న చిత్రహింసల గురించి, అలానే కోడలు, వారి పిల్లల గురించి పోలీసులకు వృద్ధ దంపతులు చెప్పారు. ఈ సంఘటన
వరంగల్ జిల్లా, దామోదర మండలంలోని మస్తానపల్లిలో జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. మానవీయ కోణంలో చూసుకుంటే ఆ తల్లిదండ్రులు చేసింది కరెక్ట్. కానీ చట్టప్రకారం అది తప్పు కావడంతో తల్లిదండ్రులను
అరెస్ట్ చేశారు.