పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులూ .. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. లాంగ్ మార్చ్ లో పవన్ ప్రసంగానికి .. తెలుగు మీడియం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇస్తుంది. తాజాగా వైసీపీ మంత్రి పేర్ని నాని .. పవన్ మీద విరుచుకుపడ్డారు. అయితే పేదింటి పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమ బోధనను చేరువ చేసేందుకు జగన్ సర్కారు... అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. దీనిపై దాదాపుగా వైసీపీ మినహా అన్ని పార్టీలు నిరసన గళం అందుకున్నాయి. ఈ క్రమంలో తన వాదనను వినిపించే క్రమంలో సీఎం హోదాలో జగన్... నిరసన గళం విప్పిన వారి పిల్లలు ఏ మాద్యమంలో చదివారంటూ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.


అంతే కాకుండా జగన్ .. పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్ చేసిన సంగతీ తెలిసిందే. ఈ వ్యాఖ్య సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ మూడు పెళ్లళ్లను జగన్ మరోమారు ప్రస్తావించారు. అంతే... అగ్గి రాజుకుంది. పవన్ స్పందించారు. జగన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిగా ఇప్పుడు బంతి మళ్లీ వైసీపీి కోర్టులోకి వచ్చేసింది. జగన్ తరఫున జగన్ కేబినెట్ కీలక మంత్రిగా ఉన్న పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని దిగిపోయారు. పవన్ ను ఓ రేంజిలో విమర్శించారు. తనదైన శైలి పవర్ ఫుల్ పంచ్ లతో పేర్ని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.


పవన్ మీద పదునైన విమర్శలతో పేర్ని నాని రెచ్చిపోయారు. చంద్రబాబు మద్దతుగానే పవన్ వ్యవహారం నడుపుతున్నారన్న సంచలన ఆరోపణను సంధించిన నాని... పవన్ పేరుకు చంద్రబాబు నాయుడి పేరులోని నాయుడు పదాన్ని తగిలించేసి పవన్ నాయుడు అని సంబోధించారు. కులాల పట్టింపు లేదని నిత్యం చెప్పుకునే పవన్ నాయుడికే కుల గజ్జి అంటుకుందని ఏపీలో కులగజ్జికి పదును పెట్టిందే పవన్ అని విమర్శించారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్... ఇన్నేళ్లలో ఒక్కసారి అయినా చంద్రబాబును ప్రశ్నించారా? అని కూడా సూటిగా ఎధురు దాడికి దిగిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: