రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు. అవును అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ నేతల్ని చూస్తే ఇది నిజమనిపిస్తుంది. తాజాగా టీడీపీలో సరిగ్గా అలాంటిదే జరిగింది. నాలుగు నెలలు వరకు ఉప్పు-నిప్పులా.. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తిట్టిపోసుకున్న నేతలు మళ్లీ దగ్గరయ్యారు. మొన్నటి వరకు ఎడమొహం, పెడా  మొహంగా ఉన్న ఇద్దరు ఒకే వేదికపై పక్క,పక్కన కూర్చున్నారు.


ఈ అనూహ్య పరిణామం చూసి టీడీపీ నేతలు, కార్యకర్తలు  షాక్ గురి అయ్యారు . వాళ్లే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో చేపట్టబోతున్న దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడలోని కేశినేని భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.


వేదికపై మాజీ మంత్రి దేవినేని ఉమా, బొండా ఉమా, కేశినేని నాని, బుద్దా వెంకన్నతో పాటూ ఒకరిద్దరు నేతలు కూర్చుకున్నారు. అయితే కేశినేని, వెంకన్న పక్కపక్కన కూర్చొన్నారు. అంతేకాదు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. మొన్నటి వరకు విభేదాలతో దూరంగా ఉన్న నేతలు.. మళ్లీ కలవడంతో కేడర్  ఆనందం తో మునిగి తేలుతుంది . చంద్రబాబు దీక్షతో ఇద్దరు నేతలు మళ్లీ కలిసి పోయారని నేతలు, కార్యకర్తలు ఆనందపడుతున్నారట.


నాలుగు నెలల క్రితం కేశినేని నాని-బుద్దా వెంకన్నల మధ్య ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. ఇద్దరూ వ్యక్తిగత విషయాలపైనా విమర్శలు చేసుకున్నారు. ఈ వివాదం మరింత ముదరడంతో అధినేత చంద్రబాబు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరికి సర్థిచెప్పడంతో అంతటితో వివాదం ముగిసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు నేతలు కాస్త ఎడ మొహం, పెడ మొహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కేడర్ కూడా కాస్త గందరగోళపడింది. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసిపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: