ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరద తగ్గడంతో సరఫరా పెంచడం జరిగింది అని, వారం రోజులపాటు పూర్తిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలియచేయడం జరిగింది. ఈ విషయాలు అన్ని కూడా మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడం జరిగింది.


ఇక వరద తగ్గినందున  వారం రోజులుగా సరఫరా పెరగడం జరిగింది అని,  ప్రస్తుతం రోజుకు 1.20 లక్షల టన్నుల ఇసుక సరఫరా అందిస్తాము అని తెలిపారు. వారం రోజుల్లో దీనిని 2 లక్షల టన్నుల వరుకు కూడా పెంచుతాము అని తెలిపారు. ఈ నెల 6వ తేదీ నాటికి మొత్తం 275 రీచ్‌లకు గాను 83 చోట్ల ఇసుక తవ్వకాలు కూడా చేపట్టగా, ఈనెల 11వ తేదీ నాటికి మొత్తం 280 రీచ్‌లలో 99 ఆపరేషన్‌లో ఉన్నాయని తెలియచేయడం జరిగింది. ఇసుక వారోత్సవాలు ముగిసే రోజుకి ఇసుక స్టాక్‌ పాయింట్లను 137 నుంచి 180కి పెంచేలా జాయింట్‌ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని తెలియ చేయడం జరిగింది.


ప్రతి నియోజకవర్గాల వారీగా రేటు కార్డులు
ఇక నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రదర్శించాలని సీఎం తెలిపారు. ఈ ధరలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరడం జరిగింది. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుకను స్టాక్‌ యార్డుల్లో సిద్ధంగా ఉంచుతామని, నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఎవరైనా విక్రయించినా ఇసుకను సీజ్‌ చేయాలని తెలియచేయడం జరిగింది. దీనితో పాటు అపరాధ రుసుం, రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా  ముసాయిదా చట్టానికి బుధవారం జరిగే కేబినెట్‌ భేటీలో ఆమోదం తీసుకుంటాము అని అన్నారు. ఇక పది రోజుల్లోగా సరిహద్దుల్లో చిన్న, పెద్ద రూట్లలో ప్రతి చోటా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది



మరింత సమాచారం తెలుసుకోండి: