రేపు సుప్రీంకోర్టు కీలక కేసుల్లో అంతిమ తీర్పులు వెలువరించనుంది. ఇప్పటికే సంచలన తీర్పులు ఇస్తూ వస్తోంది దేశ సర్వోన్నత న్యాయస్థానం. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం...రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై తుది తీర్పులు రానున్నాయి. చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ చేసిన కామెంట్లపైనా రేపు ఫైనల్ జడ్జిమెంమెంట్ వచ్చే అవకాశం ఉంది. 


సుప్రీంకోర్టు గురువారం బిజీబిజీగా ఉండనుంది. ఏళ్ల నాటి అయోధ్య భూవివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. గురువారం మరో రెండు కీలక కేసులను పరిష్కరించనుంది. శబరిమల, రాఫెల్‌  కేసుల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై దాఖలైన రివ్వ్యూ పిటిషన్లపై కోర్టు గురువారం తీర్పులివ్వనుంది. 


కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఎత్తివేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పదుల సంఖ్యలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై చీఫ్‌  జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. గురువారం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై తీర్పు వెలువరించనుంది.


మరోవైపు...దేశంలో రాజకీయ వివాదానికి తెరలేపిన రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్రానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రివ్యూ పిటిషన్లు  దాఖలయ్యాయి. ఈ ఒప్పందంలో వాస్తవ విషయాల్ని కోర్టుకు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌  గొగొయ్, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి...మే 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 


కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై కోర్టు ధిక్కరణ కేసులోనూ సుప్రీం తీర్పునిచ్చే అవకాశముంది. రాఫెల్‌పై సుప్రీం తీర్పు సమయంలో ప్రధాని మోదీ చౌకీదార్‌ చోర్ హై అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో  వివాదాస్పదమయ్యాయి. ఈ నినాదాన్ని రాఫెల్‌ తీర్పునకు వర్తింపచేసినందుకుగాను రాహుల్‌ ఇప్పటికే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. కోర్టు తీర్పునకు ఆ నినాదాన్ని రాహుల్‌ తప్పుగా అన్వయించారని ఆయనపై బీజేపీ ఎంపీ meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి  లేఖి కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: