హీరో రాజశేఖర్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఎయిర్ బ్యాగులు వెంటనే తెరుచుకోవడంతో.. కారు పూర్తిగా ద్వంసమైన కేవలం చిన్నపాటి గాయాలతో అతను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని పరిస్థితి గురించి అందరికి తెలియజేయడానికి తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో ఎటువంటి దెబ్బలు తగలలేదని చెప్పాడు. అయితే ఈ సమావేశంలో రాజశేఖర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అతను సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ...కొంత మంది వ్యక్తులు ఎవరైనా చనిపోతే కనీసం వారిని చూడడానికి కూడా వెళ్లట్లేదని తన బాధని వ్యక్తం చేశాడు. 


పెద్ద ప్రమాదం జరిగినా దేవుడి దయ వల్ల తాను బతికానని, కారు పల్టీలు కొట్టినా స్వల్ప గాయాలతోనే బయటపడ్డానని.. నుదురు పై గాయం అయ్యి రక్తం వచ్చినా ఆ దేవుడి వల్ల ఏమి కాలేదన్నాడు రాజశేఖర్. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత తనకి తనను ఎంతమంది ఇష్టపడుతున్నారో అన్న నిజం తెలిసిందన్నారు. చాలా మంది అతని పరిస్థితి విషమంగా ఉందోనని కంగారు పడుతూ ఫోన్లు, మెసేజెస్ చేసారని.. అవన్నీ చూసిన తర్వాత నిజంగా తాను సాధించాననిపించిందని.. వాళ్ళ ప్రేమాభిమానాలే అతన్ని బ్రతికించాయి అని అన్నారు. 


రాజశేఖర్ బాగా ఎమోషనల్ అవుతూ... "సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కానీ క్రమక్రమంగా పెద్దవాళ్ళకి అసలు గౌరవం దక్కడంలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే సినీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. వారిని చూద్దాం అన్న ఆలోచన కూడా కొంతమందికి రావట్లేదు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మ గోషిస్తుంది. మిమల్ని నేను మర్యాదగా కోరుకుంటున్నా.. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోయినా.. చనిపోయినా వెళ్లి పలకరించండి. కనీసం ఒక ట్వీట్ చేయండి చాలు. చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను. నా కోసం పూజలు చేసిన వారికి నా ధన్యవాదములు," అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: