అమెరికాలో అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సరిహద్దు భద్రతా దళాలను ఆదేశించారనే సంగ‌తి తెలిసిందే. అధ్యక్షుడి ఆదేశాల మేరకు అమెరికా సరిహద్దుకు చేరుకున్న వలసదారులను ఆదేశ బలగాలు అదుపులోకి తీసుకుంటున్నాయి. వలసదారుల నుంచి పిల్లలను వేరుచేసి నిర్బంధిస్తున్నాయి. గతేడాది అమెరికా అధికారుల చెరలో 70వేల మంది వలసదారుల చిన్నారులు ఉన్నట్టు యూఎన్‌ రిసెర్చ్‌ అనే సంస్థ వెల్లడించింది. వలసదారుల చిన్నారుల పట్ల బోర్డర్‌ సెక్యూరిటీ అమానుషంగా ప్రవర్తించేవారని తెలిపింది. ఇందులో భార‌తీయులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.


వలసదారుల చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరిని తక్షణమే విడుదల చేయాలని ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారు. పలు వలసదారుల నిర్బంధ కేంద్రాలను ఆమె స్వయంగా సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఎన్‌ఎఫ్‌ఎల్‌ స్టేడియంలో నిర్బంధించిన చిన్నారులను అధికారులు వదిలిపెట్టారని యూఎన్‌ రిసెర్చ్‌ సంస్థ తెలిపింది. ఫెడరల్‌ చట్టాల ప్రకారం.. వలసదారుల చిన్నారులకు ఆహారం, మందులు అందించాలి. చిన్నారులన వైద్యులు పర్యవేక్షించాలి.


అయితే, సరిహద్దు భద్రతా బలగాలు మాత్రం వీరి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించేవారని తెలిపింది. అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలతో పాటు చిన్నారుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని యూఎన్‌ రిసెర్చ్‌ సంస్థ పేర్కొంది. వలసదారుల చిన్నారులను సరిహద్దు భద్రతా దళాలు మానసికంగా హింసించేవని హర్వార్డ్‌ వర్సిటీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ షాన్‌కాఫ్‌ తెలిపారు. వలసదారుల చిన్నారులను అక్కున చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థించారు. నిర్బంధంలో ఉన్న చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు.అధికారుల చెరలో 70వేల మంది వలసదారుల చిన్నారులకు విముక్తి క‌ల‌గాల‌ని, ఆంక్ష‌ల పేరుతో వారిని బందీలుగా చేయ‌రాద‌ని ఆకాంక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: