వర్షాలు కురిసి చలి కాలం వస్తున్న సమయంలో అన్నింటికంటే మంచి ఆహరం ఏదైనా ఉందా అంటే అది చేపలు అనే చెప్పాలి. చేపల్ని ఆహారంగా ఈ కాలంలో తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. చేపల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. పైగా శరీరానికి మంచి చేసే విటమిన్లు శరీరంలో అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వలన శరీరానికి మంచి జరుగుతుంది.
అందుకే ఈకాలంలొ దొరికే చేపల ధరలు కూడా అధికంగా ఉంటాయి. ఈ ధరలను బట్టి చేపలను తీసుకుంటూ ఉంటారు. చేపలు ధరలు ఎక్కువగా ఉంటుంది. పైగా చేపల్లో ఉండే
సి విటమిన్ ఈ కాలంలో ఏంటో అవసరం. అంతేకాదు ఈ చాల నుంచి ఎక్కువగా
నూనె కూడా లభిస్తుంది. ఇక ఇదిలా ఉంటె, ఈ సమయంలో చేపలు బోలెడు డబ్బులు పోసి కొనాలి. కానీ, అవేమి అవసరం లేకుండా.. ఫ్రీగా చేపలు ఇస్తే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. కాన్పూర్లో చేపలు ఫ్రీగా ఇస్తున్నారు.
చేపలు ఫ్రీగా ఇవ్వడం ఏంటి అని షాక్ అవ్వకండి. అక్కడ లోడ్ తో వెళ్తున్న ఓ చేపల లారీ బోల్తా కొట్టింది. రోడ్డుపై ఆ లారీలో ఉన్న చేపలన్నీ పడిపోయాయి. ఒకటికారు రెండు కాదు చేపలు. అన్ని బ్రతికే ఉన్నాయి. ఇంకేముంది. చేపల కోసం ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. దొరికిన వాళ్ళు దొరికినట్టుగా పట్టుకొని సంచుల్లో వేసుకొని పరుగులు తీస్తున్నారు. భలే మంచి చౌకబేరము అన్నట్టుగా పెద్దపెద్ద గొనె సంచుల్లో పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు.
ఇలా దొరికింది దొరికినట్టుగా తీసుకెళ్లడంతో పాపం లారీ యజమాని షాక్ అయ్యాడు. చివరకు పోలీసులు కూడా దొరికింది ఛాన్స్ అని బుట్టలో వేసుకొని ఏంచక్కా పట్టుకుపోయారు. ఊరికే వస్తే కాదంటారా చెప్పండి. ఛాన్స్ దొరిందని తీసుకెళ్లిపోయారు. ఓ నాలుగైదు రోజులపాటు వాళ్లకు మంచి ఆహరం దొరికినట్టే కదా మరి. అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. అదన్నమాట సంగతి.