ఈరోజుల్లో సొంత కుటుంబ సభ్యులనే నమ్మేలా పరిస్థితులు లేవు. అలాంటిది ఓ బంధువును నమ్మి పరీక్ష రాసేందుకు వేరే పట్టణానికి వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది.పరీక్షల కోసం పట్టణానికి వచ్చిన యువతిపై ఆమె బంధువే లైంగిక దాడి చేశాడు.


వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని మహేంద్రగఢ్ గ్రామానికి చెందిన ఓ యువతి పరీక్ష రాసేందుకు గురుగ్రామ్ కు వచ్చింది. అక్కడ తనకు బంధువయ్యే వ్యక్తిని సాయం అడిగింది. ఇదే అదనుగా తీసుకున్న అతడు ఓ హోటల్లో ఉందామంటూ ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ రోజంతా ఆమెను చదువుకోనిచ్చిన ఆ బంధువు రాత్రి సమయంలో మాత్రం కామ పిశాచిగా మారాడు.


పరీక్షకు రెండు రోజుల ముందు.. ప్రిపేరవుతున్న ఆ యువతిని రాత్రి సమయంలో అత్యాచారం చేశాడు. ఎంత మొత్తుకున్నా ఆమె రోదన అరణ్య రోదనే అయ్యింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అసలే పరీక్ష ఉండటంతో ఆ యువతి మౌనంగా భరించింది. తనలో తానే కుమిలిపోయింది. ఆ పరీక్ష తన కెరీర్ కు అతి ముఖ్యంకావడంతో పళ్ల బిగువన భరించింది. పరీక్ష రాసి ఇంటికెళ్లిన తర్వాత జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది.


బంధువు ముసుగులో ఉన్న ఆ రాబంధువు బండారం బయటపెట్టింది. జరిగిందంతా వివరంగా చెబుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడి పని పట్టేందుకు గాలింపు ప్రారంభించారు. విషయం ముందుగానే గ్రహించిన సదరు యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


మహిళలు సొంత కుటుంబ సభ్యులనే నమ్మే పరిస్థితి లేని ఈ రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేకించి అమ్మాయిల తల్లిదండ్రులు.. వేరే ఊరు పంపిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: