మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లా, సత్పూర రిజర్వులో ఉన్న 'మ్యాజికల్ మాహూయ' అనే చెట్టుని ఒక్క సారి టచ్ చేస్తే చాలు ఎంతటి ప్రాణాంతకమైన జబ్బైన ఇట్టే నయం అయిపోతుందంట. ఈ చెట్టు ఎంత ఫేమస్ అయ్యిందంటే... ఐసీయూలో ఉన్న పేషెంట్లు, కొంత మంది ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఆసుపత్రి నుంచి నేరుగా ఈ అటవీ ప్రాంతానికి వచ్చి ఈ చెట్టు ని ఒక్కసారైనా స్పర్శించి తమ రోగాల్ని నయం చేసుకోవాలని క్యూ కడుతున్నారు. రోజుకి 25 నుంచి 30 వేల మంది నాయగావున్ గ్రామంలో ఉన్న ఈ చెట్టుని తాగడానికి వస్తున్నారు. 


ఈ చెట్టు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఒక స్థానిక రైతు, పేరు రూప్ కుమార్ సింగ్. ఈ చెట్టుని ముట్టుకోగానే అతని కుంటికాలు చక్కపడిందని చెప్తూ ఒక వీడియోని ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్ తో రికార్డు చేయించాడు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇది చూసిన జనం ఎక్కడెక్కడినుంచో ఈ చెట్టుని టచ్ చేయడం కోసం తండోపతండాలుగా వస్తున్నారు. విడ్డూరం ఏంటంటే ఆ వీడియోలో ఉన్న రైతు అక్కడి గ్రామం నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఇదంతా కేవలం సులువుగా డబ్బులు సందించడానికి ఆ గ్రామ ప్రజలు అల్లిన ఒక కట్టుకథ అని నమ్ముతున్నారు. 


కేవలం రెండు నెలల వ్యవధిలోనే పది లక్షల మంది రోగులు ఈ మహిమ గల చెట్టుని టచ్ చేయడానికి రావడం విశేషం. పూజలు, పునస్కారాలు, దర్శనాలు అంటూ ఈ అటవీ ప్రాంతంకి వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. ఈ సందర్భంలోనే 11 మంది కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి. 
ఈ చెట్టుని తాకితే తన రోగం నయం అవుతుందనే ఆశతో ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి బుధవారం రోజు ఆ ప్రదేశానికి వచ్చి చచ్చిపోయాడు. ఈ చెట్టు కు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో అమ్ముడుపోతున్నాయి అంటే పిచ్చి జనాలు ఈ చెట్టుని ఎంతగా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో న్యూస్ ఛానల్ లు ఈ చెట్టుకి మహిమ లేదు అని చెప్పినప్పటికీ ఈ చెట్టుని ముట్టుకోవడానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: