మానవత్వం ఇలా మంటగలుస్తుందని తెలిస్తే మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చేవారు కాదేమో మహత్ములు. అర్ధరాత్రి ఆడది తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అన్నారు. కాని పట్టపగలు కూడా రోడ్దుపైన ఆడవాళ్లూ తిరిగే పరిస్దితులు ఇప్పుడు కనబడటం లేదు. ఎందుకంటే కామం అనే వెర్రిలేచిన కుక్కలు రోడ్దుమీద తిరుగుతున్నాయి. వాటికి ఆహారం కావాలి. అది ఎలా ఉన్న వాటికి ఫర్వాలేదు. ఇదే ఇప్పుడున్న సమాజం.


ఇకపోతే మతిస్దిమితం లేని మహిళను కొందరు రాక్షసులు అత్యంత దారుణంగా పాడుచేసి నిర్ద్యాక్షిణ్యంగా వదిలేసారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ దారుణ ఘటన జరిగింది. మతిస్థితిమం కోల్పోయి రోడ్డపై తిరుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి పంచశ్యార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ(38) ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది.


అక్కడి వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను కారులో బలవంతగా ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి జాలి, దయ అనేది లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున సోనార్‌పూర్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. దీనావస్దలో ఉన్న ఆమెను చూసిన స్థానికులు బాధితురాలి వివరాలు తెలుసుకుని  బల్లిగంజ్ వెళ్లడానికి సహాయం చేసారు..


అక్కడ రైలు దిగిన బాధితురాలు గారియాహాట్‌లోని బంధువుల ఇంటికి చేరుకుని తనపై జరిగిన అత్యాచారం గురించి తెలిపింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నారు.


ఇకపోతే మతిస్దిమితం లేని బాధితురాలు తనపై ఎంతమంది అత్యాచారం చేశారన్నది స్పష్టంగా చెప్పలేక పోతోందని ఓ పోలీసు అధికారు తెలిపారు. నిజంగా ఈ సంఘటన అత్యంత హేయమైంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన సంతోషం కంటే ఇప్పుడు ఆడవారు పడుతున్న నరకయాతన వర్ణనాతీతంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: