దేశంలో మహిళల పై రోజు రోజు కు అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. తాజా గా ఇలాంటి ఘటనే దేశం
రాజధాని ఢిల్లీ లో జరిగింది. ఒక యువతి నగ్నంగా ఉన్న ఫోటోలు తీసి ఆపై ఆమెని బెదిరించి రేప్ చేసి
పెళ్లి చేసుకున్నాడు ఒక నీచుడు. విషయం బయటకు పొక్కకుండా ఆ యువతిని
పెళ్లి చేసుకుని నానా చిత్రహింసలు పెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే
ఢిల్లీ కి చెందిన
గౌతమ్ (పేరు మార్చబడింది) తమ బంధువుల ఇంట్లో ఓ పెళ్లికి వెళ్లగా అక్కడ ఓ యువతి పరిచయమైంది. ఆమెతో తరుచూ ఫోన్లో మాట్లాడుతూ చనువు పెంచుకున్నాడు. ఓ రోజు తన గదికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నగ్నంగా ఫోటోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఫోటోలు చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతీ కేసు పెడతానని చెప్పగా, వద్దని చెప్పి బ్రతిమాలి ఆ యువతిని
పెళ్లి చేసుకున్నాడు నిందితుడు.
పెళ్లి తరువాత సక్రమంగా ఉండాల్సింది పోయి తన లో ఉన్న పైశాచికత్వాన్ని బయట పెట్టాడు. ఆ యువతీ ని రోజు తాగి వచ్చి ఒళ్ళంతా సిగరెట్ల తో కాల్చేవాడు. నూరేళ్లు కలిసి ఉండాల్సిన వాడు పట్టుమని 10 రోజులు కూడా కాపురం చెయ్యకుండా యువతిని టార్చర్ పెట్టాడు.
భర్త పెట్టే వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన బాధితురాలు సహనం నశించి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిర్యాదు లో
పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతున్న తీరును పేర్కొంది యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ని పట్టుకునేందుకు వెతుకుతున్నారు. అయితే నిందితుడు పరారీ లో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని కటకటాల్లో వేస్తాం అని పోలీసులు వెల్లడించారు.