గన్నవరం ఎమ్మెల్యే వంశీ సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే ప్రెస్ మీట్ పెట్టి బాబు గారికి చుక్కలు చూపించారు. పనిలో పనిగా నారా లోకేష్ ను కూడా ఒక అట ఆదుకున్నాడు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ లే లక్ష్యంగా వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తాను టీడీపీ ఎమ్మెల్యేగానే ఉంటూ వైసీపీ ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తానని... ఏం చేసుకుంటారో చేసుకోండని కూడా వంశీ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉండి వైసీపీ సర్కారుకు మద్దతు ఇవ్వడం సరికాదని చెబుతూనే... ఆ విషయం తెలిసి కూడా ఆ మాదిరే నడవనున్న తనపై అసలు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తానన్న రీతిలో వంశీ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ప్రత్యేకించి చంద్రబాబును టార్గెట్ చేసినవేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


వంశీ మీడియా సమావేశంలో ఏమన్నారంటే  ... ‘‘మంచి కోరుకొనే వారు వైసీపీకి మద్దతివ్వాలి. నేను వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తా. సీఎం జగన్ తో కలిసి నడుస్తా. టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. వర్దంతికి..జయంతికి తేడా తెలియని వ్యక్తి నన్ను కించపరిచేలా వార్తలు రాయించి..మెంటల్ కనెక్టవిటీ దెబ్బ తీశారు. ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతిస్తా. అవసరమైతే రాజీనామా చేస్తా. చంద్రబాబు ఏపీలోనూ టీడీపీని తెలంగాణ తరహాలోనే చేస్తున్నారు.


ఇప్పటికి నేను టీడీపీ పార్టీలో ఉండి వైసీపీకి మద్దతు ప్రకటించకూడదు.  ఏం జరిగినా ఎదుర్కొంటా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి.. పార్టీ కోసం పని చేస్తే..ఆయన ఇప్పుడు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు పుత్రరత్నం..సలహాదారులు పార్టీని ముంచేస్తున్నారు. అధికారికంగా త్వరలో వైసీపీలో చేరుతా. టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదు. ఇప్పటికే పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. జగన్ చేస్తున్న డెవలప్ మెంట్ ను చూసి..వైసీపీ ప్రభుత్వానికి..జగన్ కు మద్దతుగా నిలుస్తా. ముఖ్యమంత్రిని కలిసినప్పడు జగన్ ఇచ్చిన హామీ మేరకు కలిసి నడవాలని నిర్ణయించుకున్నా. 

మరింత సమాచారం తెలుసుకోండి: