టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో రోడ్డెక్కిన జేఏసీకి తమ పట్టు సడలినట్టుగా కనిపిస్తుంది.ఆర్టీసీ జెఎసి కన్వీనర్
అశ్వద్ధామ రెడ్డి మాటలను చూస్తే అవుననే అనిస్తుంది. విలీనం తాత్కాలికంగా పక్కన బెట్టామని జెఎసి కన్వీనర్ చెప్పడం ఎందుకు ఊతమిస్తుంది. విలీనం అంశానికన్నా ముందు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని చెబుతున్నారు. హైదరాబాద్
జేఏసీ నేతను మఫ్టీ పోలీసులు
అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో విలీనాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. కాగా
తెలంగాణ సర్కార్
ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని
జేఏసీ నేత
అశ్వద్ధామ రెడ్డి ఆరోపించారు.
కార్మికులు చేపట్టిన
సమ్మె విషయంలో అటు కోర్ట్ ను, ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని చెప్పారు. ఆర్టీసీని రక్షించాలంటూ
నవంబర్ 15 తేదీన
బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు
జేఏసీ నేత
అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. 16న
హైదరాబాద్ లో తనతో పాటు నలుగురు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. 17,18 డిపోల దగ్గర కార్మికుల సామూహిక దీక్ష నిర్వహించతలపెట్టినట్టు తెలిపారు.19 న
హైదరాబాద్ నుండి కోదాడ వరకు సడక్ బంద్ చేపట్టనున్నట్టు వివరించారు. సడక్ బంద్ కార్యక్రమంలో ప్రజలు విద్యార్థులు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరుతున్నామని తెలిపారు.
సడక్ బంద్ కార్యక్రమం
ఆర్టీసీ పేరుతో విజయవంతం చేయాలి. కేంద్ర
హోమ్ శాఖసహాయ
మంత్రి కిషన్ రెడ్డిని కలిసేందుకు ఆయన మా కార్యక్రమాలన్నింటినీ మద్దతు పలికారు. ఈ క్రమంలో
గవర్నర్ తమిళ సై అప్పాయింట్ మెంట్ కోరామన్నారు. రేపో, ఎల్లుండి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో
గవర్నర్ ను కలుస్తామన్నారు. ఎన్ హెచ్ ఆర్ సీ అప్పాయింట్ మెంట్ కూడా కోరామని చెప్పారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కనీసం పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని చెప్పారు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందన్నారు.