పాకిస్తాన్.. ఎన్ని అక్రమాలు చేస్తున్నా.. చైనా అండగా ఉంటంతో ప్రపంచం సంయమనంతో ఉన్నది.  ఆ దేశం  ఉగ్రవాదులకు అడ్డగా మారింది.  ఉగ్రవాదులను తయారు చేస్తూ భారతదేశంపైకి పంపిస్తున్నది.  వారు సృష్టిస్తున్న అరాచకాలను చూసి చప్పట్లు కొడుతున్నది. రెచ్చకొట్టి ఇండియాకు పంపితే.. ఇండియన్ ఆర్మీ సైనికుల చేతుల్లో వాళ్ళు బలిఅవుతున్నారు.  ఇలా బలి అవుతున్నప్పటికీ..పాక్ కు బుద్దిరావడం లేదు.  


ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నది.  ఇప్పటికే పాక్ కు ఐరాసలోను, ఎఫ్ఏటిఎఫ్ లోను ఎదురుదెబ్బలు తిన్నది.  ఉగ్రవాదంపై పోరాటం చేయకుంటే బ్లాక్ లిస్టు లో పెట్టేందుకు ఎఫ్ఏటిఎఫ్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పినా పాక్ వినడం లేదు.  బుద్ధిమార్చుకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు.  పాక్ లో కాశ్మీరీలను ఉగ్రవాదులుగా మారుస్తున్నట్టు అప్పటి అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.  


భారత్ నుంచి ఇండియాలోకి వచ్చిన కాశ్మీరీలు మాహీరోలు. వాళ్ళను హుజాహిదిన్ లుగా మార్చి ఇండియన్ ఆర్మీ మీదకు పంపుతున్నాము అని రీసెంట్ గా ట్విట్టర్లో పోస్ట్ అయ్యింది.  ఈ వ్యాఖ్యలను ముషారఫ్ 2015లో చేశారు.  ఈ ట్వీట్ ను పాక్ అధ్యక్షుడి మాజీ సెక్రటరీ రీ ట్వీట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.  పాక్ దుర్మార్గం బయటపడింది.  


పాక్ కుట్రలు చేస్తోందని, ఇండియాకు వ్యతిరేకంగా కాశ్మీర్ యువకులను ఆకర్షించి వారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఇప్పటికే ఇండియన్ ప్రభుత్వం సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పట్టించుకోలేదు.  ఇప్పుడు పాక్ అధ్యక్షుడి మాజీ సెక్రటరీ చేసిన రీ ట్వీట్ ను బట్టి అసలు రంగు బయటపడింది.  పాక్ బండారం బయటపడినా.. ఆ దేశానికీ చైనా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.  ఇండియాకు పాక్ వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికీ సపోర్ట్ చేస్తుంది.  ఇప్పుడు ఇండియా చైనా వస్తువులను బ్యాన్ చేస్తే.. ఆ దేశం ఆర్ధికంగా ఎంత నష్టపోతుందో చెప్పక్కర్లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: