గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పై పార్టీ పరంగా దండయాత్ర మొదలైపోయింది. తెలుగుదేశంపార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడుతున్నట్లు వంశీ ప్రకటించారో వెంటనే  పార్టీ పరంగా వ్యూహం మొదలైపోయింది. వంశీ  మీడియా సమావేశంలో జగన్ కు మద్దతు ప్రకటించేనాటికి చంద్రబాబు ఇసుకకొరతపై దీక్ష చేస్తున్నారు.

 

ఎంఎల్ఏ ఉద్దేశ్యం ఏమిటి ? చంద్రబాబు, లోకేష్ తో పాటు పేర్లు చెప్పకుండానే కొందరి నేతలపై చేసిన కామెంట్లను నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే అక్కడి నుండే వంశీకి కౌంటర్ ఇచ్చే కార్యక్రమం మొదలైపోయింది. జిల్లా పార్టీలో వంశీ అంటే పడని నేతలను ముందుగా గుర్తించే పనిలో పడ్డారు. మొదటగా ఎంఎల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ కనబడ్డారు.

 

చంద్రబాబు నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం రాజేంద్రప్రసాద్ గన్నవరం ఎంఎల్ఏకి వ్యతిరేకంగా ఓ టివి చర్చలో ఆరోపణలు మొదలుపెట్టేశారు. అయితే ఎంఎల్సీ ఊహించని విధంగా సదరు టివి చర్చలో వంశీ కూడా ప్రత్యక్షమయ్యారు. రాజేంద్రప్రసాద్ చేస్తున్న ఆరోపణలకు ఎంఎల్ఏ తన కౌంటర్ మొదలుపెట్టటంతో ఖంగుతిన్నారు. చివరకు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రస్ధాయికి చేరుకుని చివరకు  వ్యక్తిగత దూషణలకు దిగేసింది.

 

వ్యక్తిగత విషయాలు వెలుగు చూసేటప్పటికి చివరకు ఇద్దరు  బూతులు తిట్టేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటి చేసిన బోడెప్రసాద్ దగ్గర ఎంఎల్సీ డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించారు. దాంతో చంద్రబాబు దగ్గర ఎంఎల్ఏ డబ్బులు తీసుకున్నాడంటూ రాజేంద్రప్రసాద్ ఎదురుదాడి మొదలుపెట్టారు.

 

కూతురు పెళ్ళికి కూడా ఎంఎల్సీ చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ మళ్ళీ వంశీ దాడి మొదలుపట్టారు. ఇలా ఒకరిగురించి మరొకరు వ్యక్తిగత విషయాలు బయట పెట్టుకుంటూ అమ్మనాబూతులు తిట్టుకున్నారు. చివరకు తిట్లు ఏ స్ధాయికి చేరుకున్నాయంటే వీళ్ళ బూతులు భరించలేక చివరకు చర్చా కార్యక్రమాన్నే సదరు ఛానల్ అర్ధాంతరంగా నిలిపేసింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వంశీపైకి ఒక్కొక్కరిని చంద్రబాబు ఉసిగొల్పటం మొదలుపెట్టారని.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: