ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉండే జబర్దస్త్ షో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. జబర్దస్త్ లో చేస్తున్న కమెడియన్స్ కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఇక జబర్దస్త్ లో హైపర్ ఆది పర్ఫామెన్స్ గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక హైపర్ ఆది స్కిట్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హైపర్ ఆది స్కిట్ స్టార్ట్ అయింది అంటే పంచుల సునామి వచ్చేస్తుంది. అంతేకాదు హైపర్ ఆది పంచ్ లో ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉండకపోవడం కూడా ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది.
నీట్ అండ్ క్లీన్ కామెడీ పంచ్ లతో హైపర్ ఆది స్కిట్ దూసుకుపోతుంది. ఇక తాజాగా హైపర్ ఆది ప్రతి స్కిట్ లో కొత్తదనం చూపిస్తున్నాడు. ఫేమస్ పర్సనాలిటీ ల్లో పరకాయ ప్రవేశం చేస్తూ పవర్ఫుల్ పర్సనాలిటీ లతోనూ పగలబడి నవ్వే పంచులు కురిపిస్తున్నాడు హైపర్ ఆది. ఇప్పుడు హైపర్ ఆది టీం కూడా అలాగే తయారైంది. అది ఎంత స్పాంటేనియస్ గా పంచులు వేస్తాడో అంతే స్పాంటేనియస్ గా కౌంటర్ ఇస్తున్నారు టీమ్ సభ్యులు. దీంతో హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే జబర్దస్త్ ప్రేక్షకులందరూ టీవీలకి అతుక్కుపోతున్నారు.
అంతా బాగానే ఉంది కదా మరి నాగబాబు హైపర్ ఆది కీ స్వీట్ వార్నింగ్ ఎందుకు ఇచ్చినట్లు అనే కదా మీ ఆలోచన.? హైపర్ ఆది స్కిట్ లో స్కిట్ తుఫాన్ ఉంటుందనే విషయం తెలిసిందే అయితే ఒక పంచ్ అర్థం చేసుకునే లోపే ఇంకొ పంచ్ అది అర్థం చేసుకునే లోపు ఇంకో పంచ్ ఇలా వరుస వేస్తుంటాడు హైపర్ ఆది. నవ్వే గ్యాప్ కూడా ఇవ్వకుండా పంచులు వేస్తున్నారు అంటూ ఇప్పటికే జబర్దస్త్ జడ్జ్ రోజా పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జబర్దస్త్ జడ్జ్ నాగబాబు కూడా అదే విషయంలో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట హైపర్ ఆది కీ . మరీ అంత వేగంగా పంచులు డైలాగ్స్ వద్దని... డైలాగ్స్ మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చూడాలి అంటు నాగబాబు హైపర్ ఆది కి సూచించినట్లు తెలుస్తోంది.