ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానెల్ లైవ్ షోలో పాల్గొన్న వంశీ పార్టీ సీనియర్ నేత బాబూ రాజేంద్రప్రసాద్ను రాయలేని భాషలో తిట్టారు. రాజేంద్రప్రసాద్ వర్సెస్ వంశీ మధ్య మాటల యుద్ధం జరగడంతో వంశీ స్వామి మాలలో ఉండి కూడా సహనం కోల్పోయారు. ముందుగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వల్లభనేని వంశీకి ఆయన తండ్రి జన్మనిస్తే.. చంద్రబాబు రాజకీయంగా జన్మనిచ్చారన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గర అయిన దాసరి కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా వంశీకి చంద్రబాబు సీటిచ్చారని చెప్పుకొచ్చారు.
డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా వంశీ తరలించడానికి ప్రయత్నిస్తే దేవినేని ఉమా మోటార్లు అపుడే పెట్టొద్దన్నారని గుర్తు చేసారు. కానీ చంద్రబాబు నాయుడు దానికి అంగీకరించారని కూడా రాజేంద్రప్రసాద్ చెప్పారు. అయితే వెంటనే లైన్లోకి వచ్చిన వంశీ రాజేంద్రప్రాసాద్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాజేంద్ర అన్నా డొక్క పగులుద్ది... నోరు మూస్కోవోయ్... ఎవరి పొలానికి నీళ్లు ఇచ్చార్రా చెత్తనా ... నోరు మూయరా.. ఒంటి కన్నుగా.. చెత్త వెధవ, చెప్పు తెగుద్ది... ఏది పడితే అది మాట్లాడితే మోం పగిలిద్ది, అంతే నువ్వు ఒక జోకర్... బఫూర్ గాడివి... నీ కూతురు పెళ్లికి బోడే ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకున్నావా ? లేదా ? అని ఇష్టారాజ్యంగా తిట్టేశారు. మరి ఈ విషయంలో బాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ? వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ? అన్నది చూడాలి.