చంద్రబాబు ఇసుక దీక్షతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపిస్తే.. ఇసుక కొరత తీర్చకుండా భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడుతున్న తమపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ కౌంటరిస్తోంది.


కార్మికుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడుతోంది. ఇక ట్విట్టర్‌లోనూ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి-టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ట్వీట్‌లతో రెచ్చిపోయారు.టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. . చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా బుద్దా వెంకన్న అటు విజయసాయిరెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సెటైర్లు వేశారు.


అంతేకాదు గతంలో నీతులు వల్లించిన జగన్ గారు సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొంటున్నారు అంటూ నిలదీశారు. ఇక దేవుడు స్క్రిప్ట్ ఏమైంది విజయసాయి రెడ్డి గారు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ గారికి టిడిపి పేరు వింటేనే వణుకు పుడుతుందా అని ప్రశ్నించిన బుద్ధ వెంకన్న 23 మంది గెలిచారు అని ఎద్దేవా చేసిన మీ జగన్ గారు ఇప్పుడు ఎందుకు తడుపుకుంటున్నారో చంద్రబాబు గారిని చూసి నిద్రపట్టడం లేదా అంటూ వ్యాఖ్యలు చేశారు.


ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీద, గతంలో దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నందుకు ఈసారి 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సెటైర్లు వేశారు. టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తెగ తాపత్రయ పడుతున్నారు అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: