గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేస్తున్న వ్యాఖ్యలు  ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి . ఇప్పటికే టిడిపి పార్టీకి రాజీనామా చేశానని చెప్పిన వల్లభనేని వంశీ... ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెబుతూనే... చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేస్తున్నారు వల్లభనేని వంశీ. ఇక నారా లోకేష్ పై కూడా ఆయన స్టైల్  లో సెటైర్లు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ ను పోలీసులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు బలవంతంగా  నారా లోకేష్ ను  పార్టీ నేతలపై ప్రజలపై రుద్దెందుకు  ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. 



 తాజాగా టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు టిడిపి అధినేత చంద్రబాబు. అంతేకాకుండా టిడిపి నేతలు కూడా నారా లోకేష్ చంద్రబాబు లపై  వల్లభనేని వంశీ చేస్తున్న వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. అయితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వల్లభనేని వంశీ... చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 



 నేను రాజీనామా చేస్తానన్నాను... లోకేష్ ను  విమర్శించాను  చంద్రబాబు కు వేరే ఆప్షన్ ఏముంది... చంద్రబాబు ఇంకేం చేయగలరు... పళ్ళు పటపట నురతాడా...  సౌండ్ ఎక్కడి వరకు వస్తుందా... ముసలి పళ్ళు ఊడిపోతాయి అంటూ వంశీ ఘాటు వ్యాఖ్యలు చేసారు.  ఇంకేం చేయగలరు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు తోక కత్తిరింపులు,  బెదిరింపులు, హుంకారాలు,  కాళ్లు పట్టుకోవడాలు  ఇవన్నీ ఎప్పుడో చూసేసాం అని వల్లభనేని వంశీ ఘాటుగా విమర్శలు చేశారు. ఎన్నికల ముందు మోడీ అమిత్ షా ను తిట్టిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు తర్వాత ఏం మాట్లాడుతున్నారు  అంటూ విమర్శించారు వంశీ .


మరింత సమాచారం తెలుసుకోండి: