స్నేహానికి విలువనిచ్చి స్నేహితుడికి అండగా నిలవాల్సిన ఇద్దరు దుండగులు దారుణానికి ఒడికట్టారు. స్నేహితుడి భార్యకు మత్తుమందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన తమిళనాడు చెన్నైలోని విరుగంబాక్కంలోని గాంధీనగర్ ప్రాంతంలో జరిగింది. గాంధీనగర్ లో నివాసముంటూ... ఇంటీరియర్ డిజైన్, వడ్రింగి పని చేసుకుంటున్న ఓ వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో 26 ఏళ్ల మహిళని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మంచిగానే జీవిస్తున్నారు. అయితే అతను ఎక్కువ పనుల మీద బయట తిరుగుతాడు.


ఈ క్రమంలోనే  ఓ పని మీద అతను బయటకు వెళ్లాలని రెడీ అయ్యాడు. అప్పుడు భార్యకు జాగ్రత్తలు చెప్పి, ఏమన్నా పని ఉంటే ఫోన్ చేయాలని, తన స్నేహితులు వినోద్ కుమార్ (30), హరీష్ కుమార్ (29) సాయం చేస్తారని చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఎప్పుడు నుంచో స్నేహితుడు భార్య మీద కన్నేసిన వినోద్,హరీష్ లు మంచి అవకాశం దక్కిందనుకున్నారు. అనుకున్నదే తడవు ఫ్రెండ్ వూరు వెళ్ళగానే ఓ స్కెచ్ గీశారు. ఏదో ఉత్సవాలు ఉన్నాయని దగ్గరలోని గుడికి వెళ్ళిన ఫ్రెండ్ భార్యకు ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి, ఇంటికి తీసుకొచ్చి నగ్నంగా వీడియోలు తీసి, అత్యాచారానికి ఒడికట్టారు.


ఇక ఆమె మత్తు నుంచి తేరుకున్నాక ఎవరికైనా చెబితే వీడియోలు లీక్ చేస్తామని చెప్పి బెదిరించి, పదే పదే అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఊరు నుంచి తిరుగోచ్చిన భర్త, ఆమె మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు లేకపోవడంతో, గొలుసు ఏమైందని ప్రశ్నించాడు. దీంతో ఆమె మొత్తం కథ చెప్పింది. మీ స్నేహితులు వినోద్, హరీష్ లు ఇలా మత్తు మందు ఇచ్చి, మెడలో గొలుసు తీసుకుని రేప్ చేశారని భర్తకు తెలిపింది. దీంతో అతను, భార్యని వెంటబెట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులు కోసం గాలిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: