ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలవబోతోందనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది. ఎందుకంటే గత
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినప్పటికీ కూడా స్పీకర్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత... తమ ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయింపుల కు చోటు లేదని... తమ పార్టీలోకి చేరాలనుకుంటే
ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి
రాజీనామా చేసిన తర్వాత చేరాలంటూ జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ ఫిరాయింపుల కు పాల్పడకపోవడంతో ఈ అంశం తెర మీదకు రాలేదు. అయితే తాజాగా గన్నవరం
ఎమ్మెల్యే టీడీపీ నేత
వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఈ అంశం తెర మీదకు వచ్చి అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే
వల్లభనేని వంశీ వైసీపీలోకి రానున్నారన్న విషయం పై
టిడిపి ఎలా వ్యవహరిస్తుంది...
వల్లభనేని వంశీ వైసీపీలో చేరే ముందు ఆయన
ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తారా... ఒకవేళ గన్నవరం
ఎమ్మెల్యే గా ఉన్న
వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తే దానిని స్పీకర్ ఆమోదిస్తారా... అన్న ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టినున్నట్లు తెలుస్తోంది . అయితే
జగన్ ఇప్పటికే తమ పార్టీ లోకి రావాలంటే
ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేయాలనీ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఒకవేళ
వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తే గన్నవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయి. ఇక
వంశీ తర్వాత వేరే పార్టీ లోకి వెళ్లాలి అనుకుంటున్నా ఎమ్మెల్యేలు కూడా
టిడిపి సభ్యత్వానికి
ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేయాల్సి ఉంటుంది.
టీడీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు
బిజెపి తీర్థం తీసుకున్న
వైసీపీ కండువా కప్పుకున్న ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. అయితే గత కొన్ని రోజులుగా టిడిపిపై ధ్వజమెత్తి తీవ్ర విమర్శలు చేస్తున్న
వల్లభనేని వంశీ వైసిపి పార్టీలు చేరకుండా తటస్థంగా నే ఉండిపోతారని... కాబట్టి
ఎమ్మెల్యే సభ్యత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు అంటూ మరి కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వంశీ
టీడీపీ ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేసి వైసీపీలో చేరతారా లేక అలాగే ఉంది
ఎమ్మెల్యే కొనసాగుతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది .