టీడీపీ అధినేత చంద్రబాబును కొడాలి నాని తిట్టినట్టు మరెవరు తిట్టలేదని చెప్పాలి. కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు మీద ఘోరంగా రెచ్చిపోయారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రజల కోసం కష్టపడుతుంటే ఓర్వలేక పవన్ కల్యాణ్ శాపనార్థాలు పెడుతున్నారని చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ మచిలీపట్నం రోడ్డులోని ఇసుక పాయింట్ను పరిశీలించిన తరువాత ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని వేల కోట్ల రూపాయల ఇసుకను చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. చంద్రబాబు లోకేష్ నాయకత్వంలోని టీడీపీ నేతలు పంచభూతాలనూ మింగేశారని ఆయన అన్నారు.


నిజానికి చంద్రబాబును ఈ రేంజ్ లో ఇంత వరకు తిట్టలేదని చెప్పాలి.  గతంలో తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబును దారుణంగా తిట్టిన తరువాత ఆ స్థాయిలో తిట్టిందే కొడాలి నానీయే.‘‘ఇసుకపోరాట దీక్ష అని చెప్పి మెడలో ఇసుక ఏసుకుని దీక్ష చేశాడు. సిగ్గూశరం లేదు. ఎందుకేసార్రా అని ఒక కార్యకర్తను అడిగితే ఎలాగూ తినలేడు కదా అందుకని బొయికలు మెడలో వేసుకోవాలని అలాగ చేశాడు అని చెప్పాడు.చంద్రబాబు నాయుడూ.. పిచ్చవాడుగు పిచ్చ కామెంట్లతో డయాస్ మీద అడ్డమైన వాళ్లను పెట్టి మాట్లాడొద్దు. జగన్మోహనరెడ్డి క్రిస్టియనా హిందువా.. ఇవన్నీ మీకెందుకు. ఆయనకు మతం లేదు కులం లేదు. జనం కోసం పనిచేస్తున్నాడు.


సిగ్గు శెరం లేకుండా జగన్ మోహన్ రెడ్డి మతం గురించి మాట్లాడుతున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో సంతకం పెట్టావా అని జగన్మోహనరెడ్డిని అడుగుతున్నారు. తిరుపతి మీ అమ్మ మొ** కట్టించాడా? ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా జగన్మోహనరెడ్డికి ఏ గుడిలోకైనా ఏ మసీదులోకైనా వెళ్లేందుకు అర్హత ఉంది.చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ కూడా అంతే.. ఈయనేం మాట్లాడుతాడో ఆయనా వెంటనే అదే మాట్లాడుతాడు.చంద్రబాబు సన్నాసి టైటానిక్ షిప్ను ముంచినట్లు పార్టీని ముంచేస్తాడని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం మీద ఎందుకేడుస్తారు. నీ పిల్లలు మనవడు పవన్ కల్యాణ్ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడం లేదా.. అలాగే పేదల పిల్లలూ ఇంగ్లీష్ మీడియం చదవవాలని జగన్మోహనరెడ్డి తలపోస్తే మట్టి కొట్టుకుపోవాలని శాపాలు పెడతారా’’ అంటూ నాని చంద్రబాబు పవన్లపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: