గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నేతలపై రెచ్చిపోతున్నారు. ప్రత్యేకించి నారా లోకేష్ ను, చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేసి మరీ తిడుతున్నారు. గన్నవరానికి పప్పు వస్తాడో వాళ్ళ బాబు చంద్రబాబు వస్తాడో తేల్చుకోవాలన్నారు. ఇద్దరు కలిసి వచ్చినా సరే తాను మాత్రం రెడీగా ఉన్నానని చెప్పారు. టిడిపి సోషల్ మీడియాలో తన గురించి ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్న వల్లభనేని వంశీ నేను తప్పు చేస్తే నేను సన్నాసినే.. కానీ చంద్రబాబు డబల్ సన్నాసి, నేను వెధవని అయితే చంద్రబాబు డబల్ వెధవ అంటూ రెచ్చిపోయారు.


లోకేష్ ఆస్తులను కాపాడుకోవడానికి, కేసులకు భయపడి పార్టీ మారుతున్నానని చేసిన వ్యాఖ్యలకు వంశీ మండిపడ్డారు. చంద్రబాబు లాగా తనమీద ఓటుకు నోటు కేసు లేదన్నారు. అంతేకాదు ప్రస్తుతం నేను చేస్తున్నది పార్టీకి ద్రోహం అయితే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు అవకాశం ఇచ్చిన ఇందిరాగాంధీ విషయంలో చేసింది ద్రోహమే కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంతేకాదు ఒకటికి పది సార్లు చంద్రబాబు వల్లభనేని వంశీ కి ఏం చూసి టికెట్ ఇచ్చారని పదేపదే మాట్లాడుతున్న వాళ్లకు, నాడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సమయంలో ఇందిరాగాంధీ ఏం చూసి టికెట్ ఇచ్చారు అంటూ ప్రశ్నించాడు. చంద్రబాబు నాయుడి తండ్రి ఖర్జూర నాయుడు ఏమైనా మైసూర్ మహారాజానా చెప్పాలని ప్రశ్నించాడు. తన గురించి చెప్పడానికి ఏమీ పెద్దగా ఉండదని అదే చంద్రబాబు చరిత్ర చెప్పాలంటే చాలానే ఉందని అదంతా బయటపెడతానని హెచ్చరించారు వల్లభనేని వంశీ.


తన తిట్లకు వంశీ రీజన్ కూడా చెబుతున్నారు. తాను వంద సార్లు చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోకపోవడం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలకు దిగడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం తనను చాలా బాధించిందని అందుకే తాను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఇక లోకేష్ ప్రస్తావన తెచ్చినప్పుడు, లోకేష్ అంటే ఎవరో అనుకుంటాను .. పప్పు అనండి అంటూ తను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ పప్పు అనే ప్రస్తావించాడు వల్లభనేని వంశీ.


మరింత సమాచారం తెలుసుకోండి: