జీవితం ఒక చదరంగం అంటారు. ఒక జీవితమే కాదు రాజకీయం కూడా అంతకంటే పెద్ద చదరంగం. మహా రణరంగం. ఎందుకంటే నీతిగా జీవించాలని రాజకీయాల్లో ప్రవేశించిన వారు కూడా అవినీతిని అడ్డగా చేసుకుని తమ విలువల్ని మరచిపోతున్నటువంటి పెద్ద మురికి కూపం రాజకీయం. ఇకపోతే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై ఇప్పటికే దుమారం లేస్తుండగా దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో గులాభిరంగు కాస్త గుడ్దిగా మారుతున్నట్లుగా కనిపిస్తుందని కొందరు అంటున్నారు.


ఈ దశలో ఈనెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె హాట్ హాట్‌గా ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు గాను పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు కేసీయార్ పుత్రుడు కేటీయార్..


ఇదే కాకుండా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్.. తన మీద పోలీసులు చేసిన దాడి గురించి ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్టీసీ అంశం మీద ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఎంపీలకు కేటీఆర్ సూచనలను ఇస్తున్నారు. ఇకపోతే ఆర్టీసీ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏదైతే చెబుతున్నారో వాటినే ఎంపీలు పార్లమెంట్‌లో కూడా వినిపించాలి.


ఎవరు మాట్లాడినా అవే అంశాలు ఉండాలి. తలోరకంగా మాట్లాడొద్దు. ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఏం చెబుతుందో అదే చెబుతాం.  ఎంపీలు ప్రిపేర్‌గా ఉండండి. అంతేకాక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే నాటికి ఆర్టీసీపై అధికారికంగా ఒకరో, ఇద్దరు మాత్రమే మాట్లాడేలా ప్లాన్ చేద్దామని కేటీఆర్ఎం పీలకు సూచించినట్టు తెలిసింది. ఇకపోతే కొందరు నిజా నిజాలు తెలిసిన విద్యావంతులు ఓ రాజ్యాంగమా నవ్వుకో నీ పేరు చెప్పుకుని నిన్నే అమ్ముకుంటున్న వారి బ్రతుకులు చూసి నవ్వుకో అంటూన్నారట?


మరింత సమాచారం తెలుసుకోండి: