పొట్ట కుడు కోసం బోలెడు ఉపాయాలు అన్నట్లు, అందరూ  ఏదో ఒక పనిని చేసుకంటూ వెళ్తుంటారు. కానీ కొంతమంది వారి పొట్ట కోసం పక్కోని పొట్టను కొట్టడం అలవాటు. ఇలాంటిదే  తూర్పు గోదావరి జిల్లాలో హనీ ట్రాప్ కలకలం రేపింది. అమ్మాయితో కలసి వల పన్ని అమాయకుల్ని ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు ఒకటి బయట పడింది. డబ్బు, బంగారం పోగొట్టుకున్న బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో బయటపడిన నిజాలతో పోలీసులకే మతి పోయింది.
అమాయకుల్ని ట్రాప్ చేస్తున్న ఈ ముఠా రాకేష్‌ అనే వ్యక్తి భార్య అశ్విని తో గొల్లల మామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్‌ చేశారు. మణికంఠ రెడ్డికి మాయ మాటలు చెప్పి పరిచయం పెంచుకునేలా వారు చేశారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేశారు. ఆ నగ్న వీడియోలను చూపించి మణికంఠను బెదిరించి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వారు వినలేదు.
మణికంఠను కిడ్నాప్ చేసిన ఈ ముఠా, అతడిని దగ్గర నుంచి రూ.63 వేల విలువైన ఆభరణాలను దోచుకున్నారు. తర్వాత అతడు తప్పించుకొని సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒక పక్కా ప్లానింగ్‌ తో ఈ ముఠా యొక్క ఆటకట్టించారు. రాకేష్‌ తో పాటూ అతడి భార్య, వారికి సహకరించిన మరో ఏడుగుర్ని అందరిని అరెస్ట్ చేశారు. 
ఈ ముఠాకు లీడర్‌ గా ఉన్న దుర్గారెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హనీ ట్రాప్‌ తో ఈ ముఠా అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా బారిన పడిన బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: