ఆంధ్ర రాష్ట్రంలోని
తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బయటకు వస్తారని ప్రచారం జరుగుతూ ఉంది.ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
విజయవాడ లో నిర్వహించిన దీక్షకు ఏకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. వారిలో కొందరు
బీజేపీ వైపు వెళ్ళాలి అని చూస్తున్నారని మరి కొందరు
వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్షమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు ఎటు ఫిరాయించినా అనర్హత వేటు తప్పదని ఆయన వ్యాఖ్యానించారు! తద్వారా రాష్ట్రం లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పై చర్చ జరుగుతున్న వేళ తమ్మినేని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇది వరకూ
అసెంబ్లీ లో కూడా అదే విషయాన్ని ప్రకటించారు.
ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు. ఫిరాయింపు దారులను తమ ప్రభుత్వం ఎంటర్ టైన్ చేయదని ఆయన అన్నారు. ఫిరాయింపుదారుల పై అనర్హత వేటు తప్పదని స్పీకర్ కూడా అప్పుడు ప్రకటించారు. మరోసారి అదే విషయాన్ని తమ్మినేని పునరుద్ఘాటించడం విశేషం.కాగా, ఇటీవల ఇలాగే
కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా ఫిరాయింపులు మొదలుపెట్టారు వారికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.