ఇటీవల కాలంలో చిన్న పిల్లలపై అత్యాచారాల దారుణంగా పెరిగిపోతున్నాయి.  అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలపై దాడులు జరుగుతున్నాయి.  లైంగికంగా వేధిస్తున్నారు.  ఈ వేధింపులు తట్టుకోలేక పాపం ఇబ్బందులు పడుతున్నారు. వేధింపులను నుంచి రక్షించుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... లాభం ఉండటం లేదు. 


నిత్యం  దేశంలో ఎక్కడో ఒకేచోట మహిళలు రేప్ కు గురవుతున్నారు.  చిన్న పిల్లలపై ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి.   ఒంటరిగా ఉండే పసిపిల్లలను రేప్ చేస్తున్నారు.  అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు.  ఇటీవలే చిత్తూరులో వర్షిత అనే చిన్నారిపై హత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.  మొదట అందరు దానిని హత్య అనుకున్నారు.  


కానీ, అది హత్యాచారం అని ఆ సమయంలోనే చిన్నారి మరణించిందని పోస్ట్ మార్టంలో తేలింది.  కాగా, ఊహాచిత్రం రిలీజ్ చేసి, నిందితుడి కోసం గాలిచిన సంగతి తెలిసిందే.  ఎట్టకేలకు వర్షిత పై హత్యాచారం చేసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.  చిత్తూరు కు చెందిన రఫీగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు అనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు.  


నిందితుడిని ప్రజలకు అప్పగించాలని, ప్రజలకు అప్పగిస్తే తగిని బుద్దిచెప్తామని అంటున్నారు.  ప్రజలకు దొరికితే ఎలాంటి చర్యలకు పాల్పడతారో తెలిసిందే.  అందుకే నిందితుడిని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జైల్లో ఉంచారు.  రేపో మాపో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు.  ఇలాంటి వ్యక్తులకు జైలు శిక్ష సరిపోదని బహిరంగంగా ఉరి తీయాలని లేదంటే కాల్చి చంపాలని అంటున్నారు ప్రజలు.క్షణంలో ప్రాణాలు పొతే ఆ బాధ తెలియదని.. అవయవాలు లేకుండా చేసి జీవచ్ఛవంగా వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందని కొందరు అంటున్నారు.  నరహంతకుడు గతంలో ఇలానే చిన్నపిల్లలపై అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించారు.  అలానే పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించి రెండు సార్లు జైలుకు వెళ్లినట్టుగా అధికారులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: