ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎంత వేడి వేడిగా ఉందొ అందరికి తెలుసు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా అవ్వకనే కొత్త ప్రభుత్వం జన నాయకుడిని దించేయాలి అని అనుకున్నాయి ప్రతిపక్షాలు. అందుకే అన్ని పార్టీలు బహిరంగంగానే కలిసి ఒకరి దీక్షలకు, లాంగ్ మార్చులకు మద్దతు ఇచ్చుకుంటూ ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలను
కామెడీ చేసి పడేశారు.
అలాంటి చిల్లర రాజకీయాలు తట్టుకోలేక అధికార పార్టీలోకి వచ్చి చేరుతున్నట్టు ఆ పార్టీలో నేతలే చెప్తున్నారు. అంత నీచంగా ఆ రాజకీయాలు ఉన్నాయని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రాజకీయా పార్టీలలో ఉండటం కంటే రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిది అని ప్రజలు కూడా సోషల్
మీడియా వేధికగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే
వైసీపీ మంత్రి కోడలి
నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు
ఎన్టీఆర్ గతే పడుతుంది అని అయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ
ముఖ్యమంత్రి, సీనియర్
ఎన్టీఆర్ ఎలా అయితే చివరి రోజుల్లో మానసికంగా హింసకు గురై మృతి చెందారో అలాంటి గతే చంద్రబాబు నాయుడుకు పట్టబోతోంది అని చంద్రబాబుపై
మంత్రి కోడలి
నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముక్యమంత్రి వైఎస్
జగన్ చిటికేస్తే.. ప్రతిపక్ష హోదా కాదు తెలుగు దేశం పార్టీనే స్టోర్ రూమ్ లో పెట్టేస్తాం అని అయన హెచ్చరించారు.
అంతే కాదు చంద్రబాబు నాయుడు సుపుత్రుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ
మంత్రి నారా లోకేష్ వల్లే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది అని అయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగు దేశం పార్టీకి ఇసుక, ఇంగ్లిష్, హిందూ మతం తప్ప మాట్లాడటానికి ఏమి ఉన్నాయి అని అయన ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.