తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ
మంత్రి దేవినేని ఉమ పై
కొడాలి నాని ఫైర్ అయ్యారు. సొంత మామను చంపి చంద్రబాబు నాయుడు రాజకీయాలోకి వచ్చాడని..
దేవినేని ఉమ తన అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చి... అడ్డుగా ఉందని వదినను చంపారని ఆగ్రహం వ్యక్తం చేశాడు కొడాలి నాని. ఇలాంటి లుచ్చాగాళ్ళు నా మీద కామెంట్ చేస్తారా అంటూ విరుచుకుపడ్డాడు కొడాలి నాని.
ఇటీవల
దేవినేని ఉమ..
జగన్ సన్న బియ్యం ఇస్తారని హామీ చేశాడని వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ఉద్దేశిస్తూ... సన్న బియ్యం ఇస్తానని
జగన్ నీ అమ్మ మొగుడికి హామీ ఇచ్చాడు? అంటూ
దేవినేని ఉమ పై భగ్గుమన్నారు కొడాలి నాని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిందిగా
దేవినేని ఉమని హెచ్చరించాడు.
జగన్ కేవలం నాణ్యమైన బియ్యం ఇస్తానని హామీ ఇచ్చాడని.. దాన్యం కొని నాసిరకమైన బియ్యం ఇస్తామని మేము హామీ చేసాం అని స్పష్టం చేశాడు. కానీ బియ్యం రావాలంటే కొంచెం సమయం పడుతుంది.. ఏప్రిల్ లోపు ఇచ్చేస్తాం అని
కొడాలి నాని చెప్పారు.
దేవినేని అవినాష్ మా పార్టీలో చేరారు.
వంశీ ఇంకా చేరలేదు. అప్పుడే
టిడిపి నేతలు
ప్రెస్ మీట్ లు పెట్టి మరీ మమ్మల్ని విమర్శిస్తున్నారు. అదే సుజానా చౌదరీ, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ
వెంకటేష్ లాంటి నేతలు బీజేపీలో చేరితే ఏ
ప్రెస్ మీట్ లు ఈ
టీడీపీ నేతలు ఎందుకు పెట్టి తిట్టలేదు? ఎందుకంటే బిజెపిని తిడితే వాళ్లు జైల్లో వేస్తారని నోరు మూసుకొని కూర్చున్నారు ఈ
టీడీపీ నేతలు అంటూ
కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జగన్ విలువలు లేని మనిషి కాదంటూ...
వల్లభనేని వంశీ రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలోకి తీసుకుంటారని స్పష్టం చేశాడు.