కేసీఆర్ గురించి తెలిసిన వారెవరైనా చెప్పేదే ఒక్కటే .. ఆయన ఒక నియంతలా వ్యవహరిస్తాడని .. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తక్కువని .. పార్టీలో అయితే మిగతా మంత్రులకు కూడా కేసీఆర్ చెప్పిందే వేదం అనే విధంగా ఉంటుందని. తనకు ఎవరైనా ఎదురు తిరిగితే వారికి చుక్కలు చూపించేవరకు నిద్ర పోరని కేసీఆర్ గురించి చెబుతుంటారు. కానీ ఈ మధ్య కేసీఆర్ కొన్ని విషయాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో ఆ సిద్ధాంతాన్ని పక్కనపెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ లో శివగామి టైపు. ఆయన మాటే శాసనం.. ఆర్టీసీ సమ్మె వద్దంటున్నా చేస్తున్న కార్మికుల విషయం లో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటున్నాడో చూస్తున్నాం.  అలాంటి వ్యక్తి కి కూడా ఎదురెళ్లిన  నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.


కేసీఆర్ఒ కప్పుడు తన మాట వినని వారి మీద రెచ్చిపోయే కేసీఆర్ ఇప్పుడు అందరినీ కలుపుకుపోతుండటం చర్చనీయాంశం అయ్యింది.  స్వయంగా కేసీఆర్.. తనను వ్యతిరేకించిన వారితోనూ మునుపటి లాగానే సామీప్యం గా కలిసి పోతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది..తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూశాక ఇప్పుడు గులాబీ దళం సంతోషంగా ఉందట.. అప్పట్లో మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్న ప్రచారం నేపథ్యం లో ఆయన ఎదురు తిరిగారు. 'గులాబీ పార్టీకి ఓనర్లం మేమే' అని హుంకరించాడు. అయినా ఈటెలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించలేదు. ఏమీ అనలేదు.


పైగా కేసీఆర్ ఈటెలకు చాలా సన్నిహతంగా ఉండటమే కాకుండా .. తాజాగా ఆయన కుమార్తె వివాహానికి కూడా హాజరై ఈటెలను ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్నాడు.ఇక అప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లో మాదిగలు చోటు కల్పించ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే రాజయ్య మీడియా సాక్షి గా గళమెత్తారు. అతడిని సస్పెండ్ చేస్తారని భావించారు.కానీ స్వయంగా కేసీఆర్ ఇటీవల తనను కలిసిన రాజయ్య ను వెన్ను తట్టి ప్రోత్సహించారట.. ఇది వరకు ఇలానే ధిక్కరించిన ఆలె నరేంద్ర విజయశాంతి లాంటి సీనియర్లను పార్టీ నుంచి పక్కనపెట్టిన కేసీఆర్ .. ఇప్పుడు మాత్రం తన పార్టీలోని రాజకీయ నేతలు గళమెత్తినా వారిపై కోపం ప్రదర్శించకుండా సర్దుకుపోతుండడం ఆసక్తి రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: