మనిషికి తోటి మనిషి మీదున్న నమ్మకాన్ని కొందరు దరిద్రులు, అవకాశ వాదులు ఎంతగా నీచానికి దిగజారి వాడుకుంటున్నారంటే. నోరారా అన్నా అనిపిలిచినా, బాబాయ్ అనిపిలిచినా ఆ పిలుపులో మాత్రం ఇలాంటి కామాంధులు కోరికనే చూస్తున్నారు. మనిషి మనిషిగా బ్రతకడం మరిచిపోతూ మనిషి జాతికే మాయని మచ్చను తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి కీచక పర్వంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు బలైనారు.


తనతో ఉన్నవాన్ని బాబాయ్ అంటున్నా వాడు మాత్రం వీరి దేహాలపై కోరిక పెంచుకుని తన కామాన్ని తీర్చుకున్నాడు. ఇది జరిగింది విశాఖలో నగరంలోని గోపాలపట్నంలో. ఈ  ప్రాంతానికి చెందిన వ్యక్తి అరవింద్.. ఇతను కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. ఆమె వద్ద పనిచేస్తున్న ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె భర్త చనిపోవడంతో ఆ కుటుంబానికి అరవింద్‌ ఏ సాయం కావాలన్నా చేసేవాడు.


దీంతో ఆ బాలికలు అతడిని బాబాయ్ అని పిలిచేవారు. కాని  తనిలో దాగున్న మృగం ఆ పిలుపులకు చలించలేదు.ఆ కుటుంబానికి ఏ ఆసరా లేకపోవడాన్ని అలుసుగా తీసుకుని, అక్కాచెల్లెళ్లపై కన్నేశాడు. అందులో భాగంగా పెద్ద అమ్మాయి(15)తో చనువుగా ఉంటూ కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత చిన్న అమ్మాయి(13)పై కూడా కన్నేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికలను కొద్దిరోజుల క్రితం కారులో ఎక్కించుకుని నగరానికి దూరంగా విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఇక్కడ తన కూతుళ్లు కనిపించకపోవడంతో తల్లి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసుల అరవింద్ చెర నుంచి వారిని రక్షించి తల్లికి అప్పగించారు. చూసారా మానవుల్లో అందులో కామానికి బానిసైన వారిలో ఆలోచనలు ఎంత నీఛంగా ఉంటాయో ఈ సంఘటన నిరూపిస్తుంది. అదే ఇలాంటి వాడి కూతుర్ని వేరే వాళ్ళు ఇలా చేస్తే? వాడికి అప్పుడు తెలుస్తుందంటున్నారు ఆ బాధ విలువ. ఇక సమాజంలో ఎవరి కూతురైన ఆడపిల్లనే కదా అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: