ఉల్లి పేరు చెబితే ఒకప్పుడు కేంద్రంలో ప్రభుత్వమే కూలిపోయిన పరిస్థితి గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం కూడా ఉల్లి ధర వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. బహిరంగ మార్కెట్లో కర్నూలు ఉల్లిపాయలు కూడా రూ.60 నుంచి రూ.70లకు అమ్ముడవుతుండడంతో వినియోగదారులు గిలగిల్లాడిపోతున్నారు. మహారాష్ట్ర ఉల్లిపాయల సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఇవి లభించినా మరో రూ.10 నుంచి రూ.20లు అదనంగా పలుకుతున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో వ్రతాల కారణంగా కూరగాయల వినియోగం భారీగా పెరిగినా, ఉల్లి వినియోగం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనూ ధర ఆకాశయానం చేస్తుండడం వినియోగదారులను బయపడి పోతున్నారు.


ఆంధ్ర రాష్ట్రంలో పండే ఉల్లి పంటలో 95 శాతం కర్నూలు జిల్లా నుంచే వస్తుంది. ఈ జిల్లాలో దాదాపు 88 వేల ఎకరాల్లో ఉల్లి పంట పండిస్తారు. మిగిలిన ఐదు శాతం ఇతర జిల్లాల్లో అక్కడక్కడా పండిస్తారు. అలాగే మహారాష్ట్రలోని నాసిక్ లోను భారీగా ఉల్లి పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎక్కువగా సరఫరా అయ్యేది మాత్రం  ఈ రెండు రకాల ఉల్లిపాయలే. గత వారం క్వింటం  ఉల్లిగడ్డ… 2500 నుంచి 3వేల రూపాయలు ఉండేది. కానీ శనివారం ఒక్కసారి ధర పెరిగిపోయింది. హైదారాబాద్‌ హోల్‌ సెల్‌ మార్కెట్‌లో 3700 రూపాయలకు చేరింది.


మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది కర్నూలు ఉల్లి దిగుబడులు 40 నుంచి 50 శాతానికి పడిపోయాయి. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఆ ప్రభావం ధరపై పడింది. అధిక ధరను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా రూ.25లకే కిలో ఉల్లిని సబ్సిడీ పై సరఫరా చేస్తున్నా వినియోగదారులకు అది అంతగా ఊరట నివ్వడం లేదు. ఉల్లి ధరలు భారీగా  పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నాయి విపక్షాలు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టి.. ధరలు తగ్గించే మార్గాలు చూడాలని ప్రజలు కోరడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: